రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది అనడానికి ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. పక్కవారి ఏమైనా ప్రమాదం జరిగితే.. తమకేంటీ అని పట్టించుకోకుండా రోడ్డుపై వెళ్లేవారు చాలా మందిని చూస్తుంటాం. కొంత మంది తమ పైశాచిక ఆనందం కోసం ఎదుటి వ్యక్తిని ఎన్నో ఇబ్బందులకు పెట్టడం చూస్తున్నాం.
తాజాగా చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిన కొంత మంది పోకిరిలు . రోడ్డు పక్కన నిద్రపోతోన్న ఓ వ్యక్తికి నిప్పంటించి పైశాచిక ఆనందం పోందుతూ దాన్ని సెల్ ఫోన్ లో వీడియో షూట్ చేశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తామేదో ఘనకార్యం చేశామన్నట్లు ప్రచారం చేసుకున్నారు.
ఓ పేద వ్యక్తి రాత్రి పూట రోడ్డు పక్కన నిద్రించాడు..అయితే అక్కడకు వచ్చిన కొంత మంది ఆకతాయిలు వచ్చిన కొంత మంది యువకులు ఆయనకు నిప్పంటించి రాక్షసానందం పొందారు. బాధితుడు ఆ నిప్పునుంచి దూరంగా జరగగా, ఆ యువకులంతా వచ్చి అతడిని కాళ్లతో తంతూ, చేతులతో కొడుతూ ఆనందపడ్డారు. మొత్తానికి ఈ వీడియో పోలీసుల వద్దకు వెళ్లడంతో నిందితులని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.