చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకున్న భూమా అఖిల ప్రియ కి అనేక సమస్యలు ఎదురు అవుతున్నాయి. సొంత నియోజికవర్గం నంద్యాల లో ఆమెకీ టీడీపీ జనాలకీ మధ్యన భేదం ఉంటోంది. శిల్పా మోహన్ రెడ్డి మొన్నటి వరకూ ఆమె పద్ధతి బాలేదు అంటూ ఓపెన్ గా చెప్పేసి వైకాపా లో చేరిపోగా .. తాజాగా భూమాకి చాలా సన్నిహితం గా ఉండే వ్యతి ఏవీ సుబ్బా రెడ్డి అఖిల ప్రియ మీద తీవ్రంగా తిరుగుబాటు చేస్తున్నారు.


తిరుగుబాటు చెయ్యడమే కాక తనకి వైకాపా నుంచి ఆఫర్ ఉంది అనీ కానీ టీడీపీ మీద గౌరవం తో ఉన్నాను అనీ సంచలన ప్రకటన చేసారు. " దివంగత నేత భూమా నాగిరెడ్డి కి నేను కుడి భుజాన్ని.. నాకు ఇచ్చిన ప్రాధాన్యత లో పాతిక శాతం కూడా ఆయన అఖిల ప్రియకి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ కోపంతోనే అనుకుంట ఆమె ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవడం లేదు .. నన్ను ఎందుకు వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆమెకే తెలియాలి" అంటూ చెప్పుకొచ్చారు సుబ్బా రెడ్డి.


" నంద్యాల లో ఉన్న భూమా వర్గం జనాలు అందరూ నన్ను చూసే వస్తారు. అసలు ఆ గ్రూప్ ని భూమా కోసం తయారు చేసిందే నేను .. అఖిల ప్రియ తప్ప టీడీపీ కౌన్సిలర్ లు అందరూ నాకే మద్దతుగా ఉన్నారు. ఉప ఎన్నిక వరకూ మాత్రమే టీడీపీ తో ఉంటా .. ఆ తరవాత నాకు తెలీదు మరి " అన్నారు సుబ్బా రెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: