నిన్న జరిగిన ఐసీసీ చాంపియన్ ట్రోఫీ లో చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం పొందింది.  దీనిపై ఇప్పటికే నెటిజన్లు విపరీతమైన కోపం ప్రదర్శిస్తున్నారు. మరికొంత మంది గెలుపు ఓటమి అనేది వస్తుంటాయి..పోతుంటాయి అని అంటున్నారు. అయితే కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్లు.. టీమిండియా ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. ఛాంపియన్స్ టోఫ్రీ ఫైనల్లో దాయాదులపై టీమిండియా ఓడిపోడాన్ని భారత క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ఒక్కో రకంగా ట్విట్, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.  తాజాగా తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కల్వంకుంట్ల కవిత చాలా వెరైటీగా ట్విట్ చేసి అందరినీ ఆశ్చర్యపరింది. ఇప్పుడు ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

ఇంతకీ ఎంపీ కవిత  ఓ కార్టూన్ ట్విట్ చేసింది..ఆ కార్టూన్ సారంశం చూస్తే చాలా మంది ఇప్పుడు క్రికెట్ వదిలి హాకీ వైపు చూస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయని అర్థం వచ్చేలా ఉంది.  ఏది ఏమైనా భారత్ తరుపు నుంచి అంత మంచి ఆటగాళ్లు దాయాదుల చేతిలో ఓడిపోవడం ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: