అమెరికా అంతర్జాతీయ అధ్యయన సంస్థ వెల్లడించిన ‘ప్యూ’ అధ్యయనం ప్రకారం భారతీయుల్లో సంతానం పొందగల సామర్థ్యం క్రమంగా క్షీణి స్తుండటం వల్ల 2055-60 మధ్య హిందూ జననాలలో తరుగుదల నమోదవుతుందని అమెరికాకు చెందిన "ప్యూ రీసెర్చ్" వెల్లడించింది. హిందూ జనాభాలో 94 శాతం మంది ఒక్క భారత్ లోనే ఉన్నా రని, ఇక్కడ జననాలు తగ్గడం వల్ల వారి జనాభావృద్ధి కూడా కాస్త నెమ్మదిస్తుందని వివరించింది.
మరో రెండు దశాబ్దాలకాలంలో ముస్లింల జననాల సంఖ్య, క్రైస్తవుల జననాలను కూడా మించిపోతుందని తెలిపింది. ఈ తీరుతో 2075కి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ముస్లింలదే అవు తుందని వివరించింది. 2015తో పోల్చితే 2060కి ముస్లిం, క్రైస్తవ తల్లులు ఎక్కువ మంది పిల్లలను కంటారని, వీరిలో ముస్లింల జనన రేటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఇంకా చెప్పాలంటే 2035కే ముస్లింల జననాల సంఖ్య క్రైస్తవుల జననాల సంఖ్యను దాటిపోతుందనీ వివరించింది. కాగా 2015-2060 సంవత్సరాల మధ్య అన్ని ప్రధాన మతాల జననాల రేటు లో కాస్త తగ్గుదల నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 62 శాతం మంది ముస్లింలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అంటే, ఇండోనేసియా, భారత్, పాకిస్తన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లోనే ఉన్నారు.
హిందువుల జననాలు
2010-15తో పోల్చితే 2055-60కి 3.3 కోట్ల మంది తక్కువ
కారణం భారతీయుల్లో సంతానలేమి పెరగడం
2010-15లో 10.9 కోట్ల మంది జన్మించారు
ముస్లింల జననాలు
2010-15 మధ్య 15 కోట్లు పెరిగారు
2015-60 మధ్య 70% వృద్ధి చెందుతారు
క్రైస్తవులు 34 శాతం వృద్ధి చెందుతారు
2070 నాటికి ఇరు మతాల జనాభా సమానం
క్రైస్తవుల జననాలు
2010-15 మధ్య 22.3 కోట్లు
ఇది ముస్లింలకన్నా కోటి ఎక్కువ
2055-60 నాటికి
ముస్లిం జననాలు 23.2 కోట్లు
క్రైస్తవుల జననాలు 22.6 కోట్లు
తేడా 60 లక్షల జననాలు