kcr oftem getting anger on people reptesentatives working for self కోసం చిత్ర ఫలితం

ప్రజల కోసం పని చేస్తామంటూ, ప్రజాసేవే తమకు పరమావది అంటూ రాజకీయాల్లోకి ఎన్నికై వచ్చిన ప్రజా ప్రతినిధులు స్వప్రయోజనాలు స్వంత వ్యాపారాలు, పైరవీలు చేస్తూ సాధారణ ప్రజావసరాలను తుంగలోకి తొక్కేసి "ప్రజల ఇచ్చిన మాట" మరచి తమవాళ్ళ పనులు మరవకుండా చేసుకు పోతూ జీవించేస్తున్నారు. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది.

 

రాజకీయాలా?  వ్యాపారాలా? ఏది కావాలో తేల్చుకోవాలని పార్టీలోని పైరవీకారులకు సీఎం అల్టిమేటం ఇచ్చేవరకు వచ్చింది వ్యవహారం.  టీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు పదేపదే సాగిస్తున్న పైరవీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు!  రాజకీ యాలు కావాలో లేక వ్యాపారాలు కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు! ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో, ఆ తర్వాత కూడా కొద్దిరోజులపాటు నేతల పైరవీల విషయంలో పచ్చజెండా ఊపిన సీఎం కేసీఆర్‌...రానురానూ వారి వ్యవహారం శ్రుతి మించడంతో సీరియస్‌గానే స్పందించారని తెలిసింది. ఇటీవల తన వద్దకు పనుల కోసం వచ్చిన కొందరు నాయకులకు సీఎం ఝలక్‌ ఇచ్చారని సమాచారం.


తమ ప్రభుత్వంలో రాజకీయ అవినీతిని రూపుమాపామని సీఎం కేసీఆర్‌ గత మూడే ళ్లుగా వివిధ సందర్భాల్లో ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో కొందరు నిత్యం పైరవీల్లో మునిగి ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొందరు నాయకులు తమ వ్యాపారాల కోసం, తమ వర్గం వారి కోసం నిత్యం ఏదో ఒక పనిని సీఎం దగ్గర కు తీసుకువెళుతున్నారని ప్రచా రం జరుగుతోంది. వివిధ శాఖల్లో మంత్రుల స్థాయిలో కుదరని  ‘పనుల’ ను సదరు నేతలు సందర్భం చిక్కినప్పుడల్లా సీఎం వద్దకు సిఫా రసులు తీసుకుపోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.


పార్టీ ఎంపీ ఒకరు సీఎంను కలిసే ప్రతి సందర్భంలోనూ బదిలీల ఫైళ్లు పట్టుకు వెళ్లేవారని, మొదట్లో సదరు ఎంపీ పనుల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం, ఆ తర్వాత అనుమానం వచ్చి సదరు బదిలీల సిఫారసులను పరిశీలించారని తెలిసింది. ఆ ఎంపీ బదిలీల సిఫారసులన్నీ ఒకే కులానికి చెంది ఉండడాన్ని గమనించి ఆ తర్వాత నుంచి ఆ ఎంపీని పక్కనపెట్టారని చెబుతున్నారు. అలాగే గత మూడేళ్లుగా విద్యారంగ పైరవీలు సాగిస్తున్న ఓ ఎమ్మెల్సీ ఇటీవల మరోసారి అదే పనిపై సీఎం వద్ద కు వెళ్లారని, ఈ సమయంలోనే  ‘నీకు రాజకీయాలు కావాలా లేక విద్యా వ్యాపారం కావాలా?’  తేల్చు కోవాలని ముఖ్యమంత్రి తీవ్రంగానే చెప్పారని వినికిడి.



కొందరు ఎమ్మెల్యేలు సైతం పైరవీ లు చేస్తుండగా సదరు ఎమ్మెల్యేలకు సీఎం కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. మొదట్లో నిత్యం సీఎం అధికారిక నివాసంలో తచ్చాడిన ఒక  ఎమ్మెల్యేను కూడా పూర్తిగా పక్కన పెట్టారు. చివరకు తన అపాయింట్‌మెంట్‌ లేకుండా ప్రగతి భవన్‌కు ఎవరూ రావొద్దని, నేతలంతా ఉండాల్సింది నియోజక వర్గాల్లో తప్ప తన చుట్టూ కాదని సీఎం చెప్పారని సమాచారం. దీంతో పైరవీల ఫైళ్లతో తిరిగే నేతలకు చెక్‌ పెట్టినట్టయ్యిందనే అభి ప్రాయం వ్యక్త మవుతోంది. 

kcr oftem getting anger on ministers కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: