రజినీకాంత్ ఎప్పుడెప్పుడు రాజకీయాలలోకి అడుగు పెడతారా అంటూ తమిళ రాష్ట్ర ప్రజలు మాత్రమె కాక యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది.గతం లో ఎన్నో సార్లు రజినీకాంత్ రావాల్సి ఉన్నా అనేక కారణాల వలన రాలేదు. పదేళ్ళ క్రితమే రజిని తన రాజకీయ అరంగేట్రం చెయ్యాల్సి ఉంది కానీ ఒకపక్క అమ్మ జయలలిత ప్రెజర్ తోనూ అనేక ఇబ్బందికర పరిస్థితుల మధ్యనా తాను రాకపోవడమే బాగుంటుంది అనుకున్నారు రజినీకాంత్. ఇప్పుడు తమిళనాట ఉన్న రాజకీయ శూన్యత ని దృష్టిలో పెట్టుకుని రజిని రావాలి అని జనం కూడా అనుకుంటున్నారు. డిసెంబ‌ర్ లోగా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి.. ఆ త‌రువాత‌, పాలిటిక్స్ మీద ఫోక‌స్ పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఇంకోప‌క్క ప‌లువురు ప్ర‌ముఖుల‌తో రాష్ట్ర రాజ‌కీయాల గురించి ర‌జ‌నీ చ‌ర్చిస్తున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. జ్యోతిష్యాన్ని గట్టిగానే నమ్మే రజినీకాంత్ రాష్ట్రంలోని టాప్ జ్యోతిష్య సిద్దాంతిల సహాయం తో పెద్ద నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది చూస్తున్నారట. తాను రాజకీయాలలో అడుగు పెడితే ఎంత టైం లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కే ఛాన్స్ ఉందీ అనేది ఆయన అసలు ప్రశ్న. రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందంటూ ఓ న‌లుగురు జ్యోతిష్కుల‌ను ర‌జనీకాంత్ ఆశ్ర‌యించిన‌ట్టు స‌మాచారం. రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తే… త‌న స్థానం ఎక్క‌డ‌ ఉంటుంద‌నీ, కింగ్ మేక‌ర్ అవుతానా కాదా అనే అంశాన్ని తెలుసుకోవ‌డం కోసం న‌లుగురు జ్యోతిష్కుల‌ను వేర్వేరుగా క‌లుసుకుని, వారి అభిప్రాయాల‌ను ర‌జనీ తీసుకున్న‌ట్టు స‌మాచారం. వీరిలో ముగ్గురు రజినీకాంత్ రాజకీయ భవిష్యత్తు అదిరిపోతుంది అని చెప్పడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: