టీడీపీ నాయకులు అందరిలో ఎక్కువగా వార్తల్లో కనపడుతున్న వ్యక్తి విజయవాడ ఎంపీ కేసినేని నాని. రవాణా శాఖ అధికారుల పట్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన తీరు మీద ఆయన సంస్థని ఆయనే మూసుకోవాల్సి వచ్చింది. తాజాగా ఒక మీడియా సంస్థ తో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ మారేది లేదు అనీ అదంతా తప్పుడు ప్రచారం అనీ చెప్పుకొచ్చారు నాని.


ప్రజారాజ్యం పార్టీ తరవాత రాజకీయాలకి దూరంగా ఉండాలి అనుకున్నా కానీ చంద్రబాబు ప్రోత్సాహం తోనే ఎంపీ టికెట్ తీసుకుని గెలిచాను అని చెప్పుకొచ్చారు నాని. అలాంటి ప్రాధాన్యం తనకి టీడీపీ లో ఉండగా తాను పార్టీ మారే అవసరం లేదు అన్నారు ఆయన. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ గనక లేకపోతే తన వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాలకి దూరంగా ఉంటా తప్ప మరొక పార్టీ ని ఆశ్రయించే పరిస్థితి లేదు అన్నారు ఆయన.


రవాణశాఖ అధికారులతో వివాదం ఉదంతంలో తన తప్పేం లేదని నాని కితాబు ఇచ్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు విషయంలో పత్రాలు అడిగే సరైన రీతిలో అధికారులు స్పందించలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: