ప్రధాని మోడీ అమెరికా పర్యటన చక్కగా పూర్తి అయ్యింది .. ఇదివరకు ఏ దేశాధినేత తోనూ గడపనంత సేపు మోడీ తో ట్రంప్ టైం కేటాయించి మరీ గడిపారు. ట్రంప్ అసలు ఇతర దేశాధినేతలతో మాట్లాడని సందర్భాలు కూడా ఉన్నాయి లేదా ముక్తసరిగా ఎదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.


కానీ ఇప్పుడు మాత్రం వీరిద్దరూ చాలా సీరియస్ భేటీ అయ్యారు. పైగా మోడీ తో ఫుల్ టైం స్పెండ్ చేసి చాలా సేపు మాట్లాడారు ట్రంప్. అంచనాలకి భిన్నంగా మోడీ తో ట్రంప్ దంపతులు నవ్వుతూ కబుర్లు చెబుతూ కలిసి పోయారు. మ్మోదీ కారు రాగానే ఆయన్ని దగ్గరుండి రిసీవ్ చేసుకున్న ట్రంప్ భేటీ ముగిసే వరకూ చాలా సన్నిహితంగా ఉన్నారు.


వైట్ హౌస్ లోకి వెళుతున్న సమయంలో మోదీ ఏం జోక్ చేశారో కానీ... ట్రంప్ దంపతులిద్దరూ హాయిగా నవ్వుకున్నారు. అయితే, ఆ జోక్ ఏంటో బయటకు తెలవకపోవడం గమనార్హం. భార్య మెలానియా సహా కుటుంబ సభ్యులందరితో కలసి భారత పర్యటనకు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: