ఇండో ఇజ్రాయిల్ స్నెహం జీవనగీతానికి పల్లవి-అది జీవితాలను మోసే పల్లకి అనవచ్చా? ఒకే రకమైన కస్టాలు అనుభవించే వారు, ఒకేరకమైన ఇబ్బందులలో ఉండేవాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడితే అది మాత్రం చాలా పదిలంగా ఉంటుంది. దానికి ఇటీవలి కాలములో ఉదాహరణ గా చెప్పదగినది ఇండియా-ఇజ్రాయిల్ స్నేహ బందం. బహుశ ఇది భవిష్యత్తులో మరింత ఘాడత సంతరించుకొనే శుభ శకునాలే కనిపిస్తున్నాయి. నేతన్యాహు మోడీల కలయిక ఇరుదేశాల మద్య "అన్నీ మంచి శకునములే- కోరిక తీరే దీవనలే" అనే గేయములోని మాధుర్యాన్ని పరవశంగా పంచుతున్నాయి. దీనితో ఇండో ఇజ్రాయిల్ స్నెహం మాత్రం "స్నెహం జీవన గీతానికి పల్లవి స్నేహం జీవితాలను మోసే పల్లకి" లాగా కొనసాగుతుందనటములో ఎలాంటి అనుమానాలకు ఆస్కారాం కనిపించదు. ముఖ్యంగా చ్హైనా భారత్ తో దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ వికసించిన స్నేహ పుష్పం పరిమళాలు వెదజిల్లే సందర్భాన్ని మరువలేము.
సిక్కిం సమీపంలోని భారత్-చైనా సరిహద్దుల్లో చైనా వ్యవహార శైలితోతో మనకేర్పడ్డ వివాదం ముదురుతున్న తరుణంలో భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న చిరకాల స్నేహ బంధం "వ్యూహాత్మక భాగస్వామ్యం" లోకి ప్రవేశించింది. దౌత్య పరిభాషలో "వ్యూహాత్మక భాగస్వామ్యం" అనే దానికి విస్తృతార్ధం ఉంటుంది.
మన దేశానికి తొలినుండీ ఇలాంటి సంబంధాలు చాలా తక్కువ దేశాలతో అంటే–అమెరికా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, రష్యా వగైరా దేశాలతో ఉన్నాయి. ఇరు దేశాల్లోనూ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఇక వెనక్కు వెళ్లలేనంతగా ఈ సంబంధాలు పెనవేసుకుంటాయి. ఇవి ఆర్ధిక, రాజకీయ, రక్షణ, సాంకేతిక రంగాలకు విస్తరిస్తాయి.
అందుకే ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం రెండు గంటలపాటు చర్చలు సాగిన తర్వాత మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తాజా బంధాన్ని "స్వర్గంలో కుదిరిన పెళ్లి’ లెదా మారేజ్ మేడ్ ఇన్ హెవెన్" గా అభివర్ణించారు. అంతకుముందు రోజు ఈ ద్వైపాక్షిక బంధాన్ని "ఐ స్క్వేర్ - టీ స్క్వేర్" (ఇజ్రాయెల్ టెక్నాలజీ - ఇండియన్ టాలెంట్) అని చమత్కరించారు. దేన్నయినా హృదయానికి హత్తుకునేలా చెప్పే మోదీ దీన్ని "ఐ ఫర్ ఐ" (ఇండియా ఫర్ ఇజ్రాయెల్)గా వర్ణించి ఆ పదబంధానికుండే "కంటికి కన్ను అనే భావనను "స్నెహానికి స్నీహం ఇండియా-ఇజ్రాయిల్"గా అర్ధాన్నే మార్చేశారు . ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన మొదలుకొని వ్యవసాయం, జలసంరక్షణ వగైరాల వరకూ ఏడు ప్రధానాంశాలున్నా రక్షణ, భద్రత అత్యంత కీలకం కాబోతున్నదని ఇరు దేశాల సంయుక్త ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ ప్రకటన బహురూపాల్లో, వ్యక్తీకరణల్లో ఉండే ఉగ్రవాదాన్ని ఖండించడం తోనే సరిపెట్టలేదు.
ఎన్నాళ్ళో వేచిన బంధం నేడు పెనవెసుకుంది
ఉగ్రవాదానికి, ఉగ్రవాద ముఠాలకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు, ఆశ్రయం కల్పించేవారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భాగస్వాములు కాదల్చుకున్న దేశాలు ఈ స్థాయిలో దృఢంగా తనతో ఉండాలని మన దేశం ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ విష యంలో ఇజ్రాయెల్ ముందున్నట్టయింది. ఇజ్రాయెల్ మనతో పోలిస్తే చిన్నదేశమే కావొచ్చుగానీ, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో దానికున్న అనుభవం అంతా ఇంతా కాదు. ఉగ్రవాదం తో వ్యవహరించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి లో కూడా ఆ దేశానికి పేరు ప్రతిష్ఠలు అంతా ఇంతా కాదు.
భారత గడ్డపై జరిగే ఉగ్రవాద చర్యలన్నిటి మూలాలూ పాకిస్తాన్లో ఉన్నాయని మన దేశం తరచు చెబుతుంటుంది. కొన్ని సన్ఘటనలకు సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలను కూడా వెల్లడించింది. అయినా అమెరికా మొదలు కొని చాలా దేశాలు పరోక్షంగా విమర్శిం చడమే తప్ప నేరుగా పేరెట్టి మీ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారిందని పాకిస్తాన్కు ఎప్పుడూ చెప్పలేదు. ఆ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి ముసుగులేకుండా తేటతెల్లంగా బహిరంగం గానే దోబూచులాటలు లేకుండా గట్టిగా ఖండిస్తుందని ఈ సంయుక్త ప్రకటన స్పష్టం చేస్తున్నది. అయితే మనం కూడా ఆ స్థాయిలోనే స్పందించాల్సివస్తుంది. పాలస్తీనా సంస్థల కార్యకలాపాలు హింసాత్మక రూపం తీసుకున్నప్పుడు మన దేశం కటువైన భాష ఉపయోగించేది కాదు. సమస్య పరిష్కారానికి అన్ని పక్షాలూ శాంతియుతంగా కృషి చేయాలని సూచించేది. ఇకపై మన ధోరణి కూడా ఇజ్రాయిల్ తో సంబంద బాంధవ్యాల స్థాయికి తగ్గట్టుగా మార్చుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోదీ తాజా పర్యటన ఇజ్రాయెల్తో మనకున్న సంబంధాలను పునర్నిర్వచించింది. ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాన్ని ఒకప్పుడు "యూదుమతవాదం" గా, జాత్యహంకారంతో సమంచేస్తూ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన మనదేశం ఇప్పుడు దాన్ని పూర్తిగా విడనాడిందని ఆయన పర్యటన స్పష్టం చేసింది. కొన్ని దశాబ్దాలుగా భారత్ అలా అంటున్నా ఇజ్రాయెల్ ఏనాడూ నొచ్చుకోలేదు. మనతో ఉన్న సంబంధాలపై ఆ ప్రభావం పడనీయలేదు. మోదీకి స్వాగతం చెప్పి హృదయా నికి హత్తుకున్న నెతన్యాహూ "ఈ రోజు కోసం ఇజ్రాయెల్ ఏడు దశాబ్దాలుగా వేచి చూస్తున్నదని చెప్పడం" తో భారత్తో సాన్నిహిత్యం కోసం ఆ దేశం ఎంత ఆరాటపడుతుందో తహతహలాడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి నరేంద్ర మోదీ కూడా ఆ స్థాయిలోనే ఇజ్రాయెల్ పట్ల తనకున్న మమకారాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మంత్రుల హోదాలో ఆ దేశం వెళ్లిన ఎల్కే అద్వానీ మొదలుకొని సుష్మా స్వరాజ్ వరకూ నేతలందరూ తప్పనిసరిగా పక్కనున్న పాలస్తీనా కూడా వెళ్లేవారు. ఆ దేశం మనసు కష్టపెట్టుకుంటుందన్న భావమే ఇందుకు కారణం. కానీ నరేంద్రమోదీ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. అయితే అంతర్జాతీయంగానూ, పశ్చిమాసియాలోనూ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒకరితో స్నేహసంబంధాలు ఏర్పడినంత మాత్రాన వేరొకరితో అవి నిలిచిపోతాయనుకోవాల్సిన అవసరం లేదు.
నిజానికి ఇన్నేళ్లుగా మన దేశం అరబ్బుదేశాలతో చెలిమి చేస్తున్నా అవి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్నే బహిరంగంగా సమర్ధిస్తూ వచ్చాయి. ఇజ్రాయెల్తో మన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నా ఆ దేశం కశ్మీర్ వివాదంలో ఎప్పుడూ మనల్నే సమర్ధించింది. కారణం ఉగ్రవాద భూతాలతో దేశాల్లో ప్రశాంతతకు ఎంతదెబ్బో స్వయంగా అనుభవించిన దేశం కనుకే అంత లా అర్ధం చేసుకొని మన స్నేహం కోసం మన నాయకత్వ దర్శనం కోసం అంతలా నిరీక్షించింది. అరబ్బు దేశాలతో మన వాణిజ్యం 2016–17లో 12,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో 5,000 కోట్ల డాలర్లు ఎగుమతులు, 7,000 కోట్లు దిగుమతులు ఉంటాయని ఒక అంచనా. అదే ఇజ్రాయెల్తో చూస్తే ఆ వాణిజ్యం మొత్తం 500 కోట్ల డాలర్లు మాత్రమే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఇజ్రాయెల్తో మనకున్న ఆయుధకొనుగోళ్లు 117 శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ రష్యా యే మన ప్రధాన అమ్మకందారు. ఖతార్తో కలహం వచ్చాక అరబ్బు దేశాల శిబిరం సమైక్యంగా లేదు.
మోదీ ఈ రెండేళ్ల పాలనాకాలములో పశ్చిమాసియాలోని దేశాలన్నీ పర్యటించారు. ఇన్నాళ్లకు ఇజ్రాయెల్ను ఎంచుకున్నారు. ఉగ్రవాదంపై మన దేశం చేసే పోరు భవిష్యత్తులో కొత్త రూపు సంతరించుకుంటుందని ఈ పర్యటన తేటతెల్లం చేసింది. ఉగ్రవాదంపై అంత ర్జాతీయ ఒడంబడిక కోసం రెండు దశాబ్దాలుగా సాగుతున్న చర్చలు ఆ పదానికివ్వాల్సిన నిర్వచనం దగ్గరే కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, ఇజ్రాయెల్తో మనకేర్పడిన తాజా బంధం దానికి కొత్త ఊపు రూపునిస్తుందని, వ్యవసాయ, జల సంరక్షణ, రక్షణ, రాజకీయ, సాంకేతిక, నైపుణ్య, ఆర్ధిక విధివిధానాల్లో విప్లవాత్మక, పరిణామాత్మక విలువలతోకూడిన మార్పులకు దోహదపడుతుందని చెప్పవచ్చు.