సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా మనుషుల ఆలోచనలు మాత్రం వికృత పోకడలు తొక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. కేవలం అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు మాట్లాడుకొన్నందుకే అది చాలా పెద్ద తప్పని వారిని చితకబాదిన సంఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతుండడంతో నెటిజన్లు ఈ ఘటనపై మండిపడుతున్నారు.


ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్‌గంజ్‌లో ఓ బాలుడు, బాలిక కలిసి మాట్లాడుకుంటుండగా కొందరు యువకులు వారిని అటకాయించారు. సామాజిక కట్టుబాట్లు, నైతికత పేరుతో ఇద్దరినీ విచక్షణారహితంగా కొడుతూ చిత్రవధకు గురిచేశారు.  బాలిక ద‌ళిత కుటుంబానికి చెందిన‌ది కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. అంతేకాకుండా వాళ్ల‌ను కొడుతున్న దృశ్యాల‌ను మొబైల్‌లో చిత్రీక‌రించి ఇంట‌ర్నెట్‌లో కూడా పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.


ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జ్యానికి దిగిన నిందితుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నందున దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంట‌ర్నెట్‌లో వీడియో పెట్ట‌డం వ‌ల్ల ఈ అమానుష ఘ‌ట‌న‌పై స్వ‌చ్ఛంద సంస్థ‌లు, సామాజిక కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: