టాలీవుడ్కు రెండు కళ్లు లాంటి దిగ్గజ హీరోలు దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంతో సఖ్యతతో ఉండేవారు. ఏఎన్నార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాకపోయినా తెరవెనక మాత్రం ఎన్టీఆర్కే సపోర్ట్గా ఉండేవారు. అయితే వారి వారసులు అయిన బలయ్య, నాగార్జున మధ్య మాత్రం ఆ సఖ్యత ఉన్నట్టు లేదు. నాగ్ ఎవ్వరు ఔనన్నా, కాదన్నా వైసీపీ, జగన్ అనుచరులతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటూ వ్యాపారాలు చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే నాగ్ పొలిటికల్ ఎంట్రీపై కొద్ది రోజుల క్రితం వార్తలు హల్చల్ చేశాయి కూడా... ఆయన పొలిటికల్ ఎంట్రీ వైసీపీ నుంచే ఉంటుందని, నాగ్ వైసీపీలో చేరి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఏపీ రాజధాని కేంద్రంగా నాగ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలోనే నాగ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై నాగ్ స్పందించకపోయినా, ఆయన భార్య అమల స్పందించారు. నాగార్జున పొలిటికల్ ఎంట్రీ లేదని, అలాంటిది ఉంటే తామే స్వయంగా చెపుతామని కూడా చెప్పారు. ఇక ఇప్పుడు కొత్తగా వినిపిస్తోన్న టాక్ ఏంటంటే నాగ్ పొలిటికల్ ఎంట్రీ డైరెక్టుగా లేకపోయినా ఇన్డైరెక్టుగా ఉంటుందని తెలుస్తోంది. నాగ్ వైసీపీ కోసం తెరవెనక నుంచి పని చేస్తున్నట్టు కూడా విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో నాగ్కు వ్యాపార భాగస్వామిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ సీటుకు పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. దీని వెనక నాగ్ ప్లాన్ కూడా ఉన్నట్టు సమాచారం. నిమ్మగడ్డ ప్రసాద్ నాగార్జునతో పాటు మరికొందరు జగన్తో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారన్నది అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే పక్కా బిజినెస్మేన్ అయిన నాగ్ డైరెక్టుగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం కంటే తెరవెనక నుంచే వైసీపీకి ఇన్డైరెక్టుగా సపోర్ట్ చేసి తన పని తాను చేసుకోవడమే బెటర్ అన్న డెసిషన్కు వచ్చినట్టు తెలుస్తోంది.
నాగ్ డైరెక్టుగా వైసీపీకి సపోర్ట్ చేస్తే తర్వాత టీడీపీతో, చంద్రబాబు, బాలయ్యతో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. అందుకే నాగ్ వైసీపీ కోసం తెర వెనక మంత్రాంగం నడిపిస్తూ నిమ్మగడ్డకు సపోర్ట్ చేయాలన్న డెసిషన్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికార టీఆర్ఎస్తో చాలా క్లోజ్గా ఉంటోన్న నాగ్ ఏపీలో వైసీపీకి ఇన్ డైరెక్టుగా సపోర్ట్ చేసే ప్లాన్తో ఉన్నట్టు సమాచారం.