జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా అది సంచలనమే.! ఆయన మాటతీరు అలా ఉంటుంది. ఏదైనా విషయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో ఆయన దిట్ట.! అందుకే ఆయన్ను చాలా మంది ఇష్టపడుతుంటారు. నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు..

jc diwakar reddy and jagan కోసం చిత్ర ఫలితం

          నంద్యాలలో డబ్బు పంచుతున్నారని ఆయన కుంటబద్దలు కొట్టారు. అందరూ సత్యహరిశ్చంద్రులేనని.. అయితే ప్రజలకు అన్ని విషయాలు తెలుసని జేసీ వ్యాఖ్యానించారు. పోలీసుల తనిఖీల్లో లక్షల్లో నగదు దొరికిందంటే పెద్ద విషయమేనన్నారు. సాధారణంగా ఐదు వేలో.. పదివేలో దొరికితే పక్క ఊరి నుంచి తెచ్చారనుకోవచ్చు కానీ.. లక్షల్లో దొరికితే దాన్ని అర్థం చేసుకోవాలో అని జేసీ నిట్టూర్చారు. వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారని క్లియర్ గా చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి.. తన పార్టీ వాళ్లు పంచుతున్నారో లేదో.. పంచుతారో లేదో తనకు తెలీదన్నారు.

jc diwakar reddy and jagan కోసం చిత్ర ఫలితం

          తనకు డబ్బు లేదు, పేపర్ లేదు, టీవీ లేదు.. అని చెప్పిన జగన్ పై జేసీ సెటైర్లు వేశారు. ఫోటో పెట్టుకుని మరీ నడుపుతున్నవాళ్లు.. అది నాది కాదంటే ఎలా నమ్ముతారని జేసీ ప్రశ్నించారు. ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడితే ఎప్పుడు పైకొస్తావ్ జగన్.. అని జేసీ ప్రశ్నించారు. అయితే జగన్ పై తనకు సానుభూతి ఉందన్నారు. చిన్నప్పటి నుంచి జగన్ ను చూస్తున్నానని.. మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలని తనకుందని జేసీ చెప్పారు.

ys and jagan కోసం చిత్ర ఫలితం

మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి కొడుకునని ప్రచారం చేసుకుంటున్న జగన్ పై జేసీ తనదైన శైలిలో కామెంట్ చేశారు. మహానాయకులందరూ మంచోళ్లేనా.. అని ఆయన ప్రశ్నించారు. మహానుబావుడు మహాత్మా గాంధీ కొడుకులే తప్పతాగి దొర్లాడారని ఎద్దేవా చేశారు. మహానాయకుల కొడుకులందరూ మంచోళ్లయిపోతారా.. అని జగన్ ను ఉద్దేశించి జేసీ అన్నారు.

jc diwakar reddy and jagan కోసం చిత్ర ఫలితం

రాజకీయ నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత సాధించాలని జేసీ సూచించారు. పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని.. అయితే 2018 నాటికి అది పూర్తి కాకపోవచ్చని జేసీ ఆన్నారు. అంతేకాదు.. మళ్లీ చంద్రబాబు వస్తే తప్ప పోలవరం పూర్తి కాదని జేసీ కుండబద్దలు కొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: