ఎన్నికల వేళ దగ్గర పడుతూ ఉండడం తో నంద్యాల ఉప ఎన్నిక వేడి క్షణ క్షణం రాజుకుంటూ ఉంది. విమర్శలు ప్రతి విమర్సలూ ఇలా చాలా సీరియస్ గా సాగుతోంది ఇక్కడ సమరం. రెండు పార్టీల ప్రధాన నాయకులూ తిష్ట వేసి మరీ ఈ ప్రాంతం లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.


తమ కి చేతనైనంత గా తమ పార్టీ ని గెలిపించుకోవడం మాత్రమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యం లో బాలయ్య బాబు నిర్వహించిన తాజా రోడ్ షో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.


టీడీపీ కార్యకర్తలలో మంచి ఉత్సాహం నింపిన బాలయ్య తనదైన శైలి లో జగన్ కి వార్నింగ్ లు ఇస్తూ సాగారు. ఈ రోడ్ షో కి సంబంధించి హీరోయిన్ , ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చెయ్యడం విశేషం.


తాజాగా రోడ్ షో తో నంద్యాల మొత్తం తిరిగిన రోజా బ్రిటిష్ వారి కన్నా మనల్ని గొప్పగా మోసం చెయ్యడం లో చంద్రబాబు నెంబర్ వన్ అని చెప్పుకొచ్చారు. " ఫ్యాన్ లోపల ఉంటుంది సైకిల్ ఇంటి బయట ఉంటుంది. మనకి ఎప్పుడు పని వచ్చిన శిల్పా మోహన్ రెడ్డి సహకరిస్తారు , బ్రహ్మానంద రెడ్డి ఎక్కడ ఉంటారో కూడా ఎవ్వరికీ తెలీదు కాబట్టి వెంటనే హెల్ప్ అయ్యే శిల్ప కే ఓట్లు వెయ్యండి " అంటూ ఆమె ప్రసంగం సాగింది. " మాహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడు బాహుబలి దే అలాగే నంద్యాల గడ్డ ఎప్పటికీ వైకాపా దే .. ఫ్యాన్ గాలి చాలా గట్టిగా ఉంది అందుకే ఆ గాలి తట్టుకోలేక తన విగ్ ఎగిరిపోతుంది అని బాలయ్య పారిపోయాడు " అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: