వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో బిజిగా ఉన్నారు. ఎలాగైనా ఆ సీటుకు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. అతి పిన్న వయసులోనే ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం జగన్ గొప్పదనం. అయితే ఇప్పుడు జగన్ మరో మెట్టు పైకెక్కారట.! అదేంటో తెలుసా..?

Image result for jagan

          వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా సుపరిచితుడు. అంతకుమించి వైసీపీ నేతలు మహానేతగా పిలుచుకునే వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు. ఆయన మరణానంతరం పార్టీ పెట్టి అంచలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. అయితే జగన్ మరో రికార్డు సాధించినట్టు నంద్యాల ప్రచారంలో వెల్లడైంది. అది కూడా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేంతవరకూ ఎవరికీ తెలీదు.

Image result for chandrababu

          వై.ఎస్.జగన్ పై క్రిమినల్ లా కోర్సులో ఇటీవల జగన్ గురించి పాఠాలు ప్రవేశ పెట్టారట. ‘ఇటీవల క్రిమినల్ లా సిలబస్ లో క్విడ్ ప్రోకో సబ్జెక్ట్ పెట్టారు. ఇందులో జగన్ ని, గాలి జనార్ధన్ రెడ్డిని ఉదాహరణలుగా చూపిస్తూ ఎలా అవినీతికి పాల్పడొచ్చూ ప్రస్తావించారు. ఇటువంటివాళ్లు ఎన్నికల్లో గెలిస్తే అవినీతే నీతిశాస్త్రంగా పెట్టేస్తారు’ అని చంద్రబాబు అన్నారు.

Image result for jagan

          చంద్రబాబు వెటకారంగా అన్నారో.. లేక నిజంగానే క్విడ్ ప్రోకోపై లాలో సబ్జెక్టు ప్రవేశపెట్టారో తెలియక అక్కడున్నవాళ్లంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఏదైతేనేం .. టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు అలా చెప్పగానే చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: