బీజేపీ నాయకత్వం లో చంద్రబాబు మీద ప్రశంసలు కురిపిస్తూ ఆయన పనితీరు బాగుంది అని మెచ్చుకునే వారు పెద్దగా కనపడరు. పేరుకే మిత్ర పక్షమయినా చంద్రబాబు తో క్షణం పడని ఈ బీజేపీ జనాలు ఎప్పుడూ ఒంటరి పోరు కోసమే చూస్తూ ఉంటారు. అయితే ఇద్దరు మాత్రం బీజేపీ తరఫున చంద్రబాబు కి ఎప్పుడూ భజన చెయ్యడం అలవాటు ఉన్నవారు.


ఒకరు మాజీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రెండోది రాష్ట్రం లో మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్. వెంకయ్య ఉప రాష్ట్రపతి అయిపోయారు కాబట్టి ఇక ఆయన నుంచి చంద్రబాబు మీద ప్రశంసలు ఆశించడం కష్టం.


ఇక ఆస్థాయి లో కాకపోయినా కామినేని చంద్రాబాబు కి తనదైన సపోర్ట్ ఇస్తారు అని చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా కామినేని ఇవ్వాల్సిన దానికంటే చంద్రబాబు కి ఓవర్ సపోర్ట్ ఇచ్చేస్తున్నారు అని బీజేపీ లో మాటలు వినపడుతున్నాయి. మొన్న మొన్నటి వరకూ కామినేని సపోర్ట్ బాబుకి గట్టిగానే ఉన్నా బీజేపీ అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు కానీ రీసెంట్ గా మోడీ కంటే బాబు గొప్ప అంటూ భజన మొదలెట్టడం తో బీజేపీ జనాలకి చిర్రెత్తుకొచ్చింది.


విజయవాడ లో ఒక కార్యక్రమం లో బాబు మీద పొగడ్తల వర్షం కురిపించిన కామినేని అంతటితో ఆగకుండా మోడీ వలన సాధ్యం కాని పనులు చంద్రబాబు చేస్తున్నారు అనడం వివాదాస్పదం అయ్యింది. యూకే సంస్థ అమ‌రావ‌తికి రావ‌డం వెన‌క చంద్ర‌బాబు కృషి చాలా ఉంద‌ని చెప్పారు. అప్పట్లో మోడీ ఇంగ్లాండ్ వెళ్ళినా చాలా విషయాల మీద చర్చలు జరిపినా అమరావతి ప్రస్తావన రాలేదు అనీ కానీ చంద్రబాబు వెళ్ళిన వెంటనే పనైంది అనీ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: