నంద్యాల ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన వేళలో రాజకీయ పార్టీలు తమ చివ్వరి బుల్లెట్ లని వాడేసాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి అతని కుటుంబం చేసిన అవినీతి మీద చేసిన అవినీతి ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి.


దానికి వారివైపు నుంచి సమాధానం కూడా తీవ్రంగా వినిపిస్తోంది . పార్టీ మీద ఉన్నంత కాలం కనపడని తప్పు పార్టీ మారగానే వచ్చేసిందా అంటూ చంద్రబాబు ని ఎద్దేవా చేస్తున్నారు వైకాపా వారు.


వైకాపా త్వరలో బీజేపీ లో విలీనం అవుతుంది అనే కథనం రిపబ్లిక్ టీవీ ప్రచారం చెయ్యగా దాన్ని ఆంధ్ర జ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. మరొక పక్క మంత్రి సోమిరెడ్డి తన విమర్శలు కొనసాగిస్తూ జగన్‌ తరపున విదేశాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. .


టిడిపి ఎంఎల్‌సిని చేసిన మాజీ మంత్రి ఫరూక్‌ మేనల్లుడు వైసీపీలో చేరారు. కొన్ని ఛానల్ వారు తమమీద కావాలనే బీజేపీ విషయం లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు వైవీ సుబ్బారెడ్డి. ప్రచార పర్వం ఆఖరి దశలో ఉండగా చాలా మాటల తూటాలు పేలాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: