— టీడీపీ గుండాల దాడి.. తోపులాటతో భయాందోళనకు గురైన ఓటర్లు. చోద్యం చూస్తూ నిలబడిన పోలీసులు.
— నంద్యాలలోని గాంధీనగర్లో డబ్బులు పంచుతోన్న టీడీపీ నేత అన్న రాంబాబు అనుచరులు.. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు.
— నంద్యాల ఉప ఎన్నికలో ఇప్పటికే సుమారు 65 శాతం వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.
— ఈ ఎన్నికల్లో 80 శాతం వరకూ పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఇరు పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
— కొన్ని చోట్ల ఏవీఎంలు మొరాయించడంతో గంట సేపు ఆలస్యమైందని, మిగతా చోట్ల చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
— ఓటర్ స్లిప్తో పోలింగ్ కేంద్రానికి వచ్చిన లక్ష్మమ్మను ఓటర్ లిస్టులో పేరు లేదంటూ వెనక్కి పంపారు. కళ్లెదుటే నిల్చున్న లక్ష్మమ్మను పట్టుకొని చనిపోయావంటూ పోలింగ్ సిబ్బంది చెప్పడంతో ఆ వృద్ధురాలు షాక్కు గురైంది.
— నంద్యాలలోని నందమూరి నగర్లో 10 మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. విచారణ కోసం వారిని పోలీసులు స్టేషన్కు తరలించారు.
— రికార్డు స్థాయి పోలింగ్ దిశగా దూసుకెళ్తున్న నంద్యాల♦పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్న శిల్పా మోహన్ రెడ్డి.
— దాదాపు 90 వరకు సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో పారా మిలటరీ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.
— పటిష్ట బందోబస్తు మధ్య నంద్యాలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు రాయలసీమ రేంజ్ ఐ.జి. మహ్మద్ ఇక్బాల్ తెలిపారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారని చెప్పారు.
— మధ్యాహ్నం 1గంట వరకూ 53.1 శాతం పోలింగ్ నమోదు, ఒంటి గంట వరకూ పోలైన ఓట్లు లక్షా 16వేల 214, పోలైన ఓట్లలో మహిళలు 59,954, పురుషులు 56,260
— స్థానికేతరులు జిల్లాలో ఉండొద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోని వైనం, యథేచ్చగా ఓటర్లపై ఒత్తిడులు, ప్రలోభాలు, అధికార పార్టీ ప్రలోభాలపై నిస్తేజంగా పోలీసు యంత్రాంగం
— టీడీపీ కౌన్సిలర్ భర్త ప్రసాద్ హల్చల్ 27వ వార్డులో కౌన్సిలర్ హారిక, ప్రసాద్ అధికార దుర్వినియోగం
— నంద్యాలలోని 84, 85, 86 బూత్లలో టీడీపీ రిలీవింగ్ ఏజెంట్ల హల్చల్
— నంద్యాల గాంధీచౌక్లోని 61వ బూత్లో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
— నిఘా నీడలో కొనసాగుతోంది నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్. భారీ బందోబస్తు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బందోబస్తుతో పాటు.. నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.
— 39 పోలింగ్ సెంటర్లలో ఓటింగ్ సవ్యంగా జరుగుతుందన్నారు. సమస్యాత్మకమైన గ్రామాలు పోలీసులు భారీగా మోహరించినట్లు తెలిపారు.
— నంద్యాలలో అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు.
— నంద్యాల పట్టణంలోనే పోలింగ్ కొంత మందకొడిగా సాగుతుండగా, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో ఓటింగ్ మధ్యాహ్నానికే పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు ఇంతవరకూ చోటు చేసుకోలేదు.
— ఓటింగ్ ప్రారంభమై నాలుగు గంటలు గడువగా, ఇప్పటికే చాలా చోట్ల 40 శాతం, కొన్ని చోట్ల 50 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. వెల్లువెత్తిన ఓటర్లను చూస్తుంటే 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావచ్చని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.
— ఉదయం 10 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, రామకృష్ణ విద్యాలయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బొమ్మల సత్రంలోని ప్రాథమిక పాఠశాలలో నంద్యాల ఎంపీ ఎస్సీవై రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు
- ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం
— ఉదయం 11.00 గంటల వరకు 33 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
— గోస్పాడు మండలం దీబగుంటలో వైఎస్ఆర్ సీపీ నేత పీపీ నాగిరెడ్డి బంధువులను అరెస్ట్ చేయాలని ఒత్తిడి
— ఉప పోరులో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆపార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి.
— చంద్రబాబును రోడ్డుపై కాల్చేయాలని ఓ సందర్భంలో... ఉరి తీయాలని మరో సందర్భంలో కామెంట్స్ చేశారు. జగన్ కామెంట్స్పై టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
— ఈ నెల 28 న నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
— నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 19వ బూత్ నందమూరి నగర్లో మొరాయించిన ఈవీఎం.. 94వ బూత్ నంద్యాల ఎన్.జి.ఓ. కాలనీలో మొరాయింపు177వ బూత్ బ్రహ్మాణపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి.