సరిగ్గా నంద్యాల ఉప ఎన్నిక రోజున టీడీపీ కి చిన్నపాటి షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా నటి , క్యారెక్టర్ ఆర్టిస్ట్ కవిత త్వరలో తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చెయ్యబోతున్నారు అనే న్యూస్ సర్వత్రా వ్యాపిస్తోంది.


ఆర్య వైస్యులకి ఆ పార్టీ లో తీవ్ర అన్యాయం జరుగుతోంది అని ఆమె ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు. కష్టపడినా కూడా సరైన గుర్తుంపు లేదు అనే మాట ఆమె నోట్లోంచి చాలాసార్లు విన్నారు చంద్రబాబు సైతం. ఇక ఉండబట్టలేక ఆమె టీడీపీ నుంచి వెళ్లిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఇదే విషయం తన అనుచరుల దగ్గర ప్రస్తావించిన ఆమె ఎమ్మెల్సీ పదవులతో పాటు కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఆర్య వైస్యులకి దక్కలేదు అని ఆమె చెప్పుకొచ్చారు. తనకి అప్పట్లోనే ఎమ్మెల్యే సీటు ఇస్తాం అని చెప్పి ఇప్పటి వరకూ రాకుండా చేసారు అన్నారు కవిత.


ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ ఇలా ఉండేది కాదు అని ఆమె వాపోయినట్టు సమాచారం. ఈ సంవత్సరం మహానాడులో తనను అవమానించారని, తనతో కన్నీరు పెట్టించారని కవిత వాపోయిన సంగతి తెలిసిందే. త్వరలో ఆమె టీడీపీ కి బై బై చెప్పేసి వైకాపా లో చేరతారు అనే వార్తలు వస్తుండగా, ఆమెని తమ పార్టీలో జాయిన్ చెయ్యాలి అనే ఉద్దేశ్యం తో ఉన్నారు బీజేపీ వారు. ఇవాళ సాయంత్రం లోగా ఈ నిర్ణయం జరిగేలా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: