నంద్యాల బైపోల్ ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీల అభ్యర్థులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అభ్యర్థులతోపాటు వారి కుటుంబీకులు, ఏజెంట్లు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికా రెడ్డి మరింత తెగించి ముందుకెళ్తున్నారు.


          నంద్యాల, ఆళ్ళగడ్డ అనగానే మనకు ఫ్యాక్షన్ ప్రభావం ఎక్కువ అని ఠక్కున గుర్తుకొస్తుంది. అలాంటి ఏరియాల్లో పర్యటించాలంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ భూమా మౌనికారెడ్డి మాత్రం ఫ్యాక్షన్ ప్రభావిత వార్డుల్లో ధైర్యంగా వెళ్తున్నారు. ఉదయం నుంచి ఆ ప్రాంతాల్లోనే తిరుగుతూ ఓటర్లలో ధైర్యం నింపగలుగుతున్నారు. మౌనికను చూస్తున్న ఓటర్లు భూమా నాగిరెడ్డిని తలుచుకుంటున్నారు. భూమా కూడా గతంలో ఇలాగే ధైర్యంగా పర్యటించేవారని గుర్తు చేసుకుంటున్నారు.

Image result for nandyal bypoll mounika

          అఖిలప్రియతో పోల్చితే మౌనిక రెడ్డికి మొదటి నుంచి దూకుడు ఎక్కువని ఆమెను బాగా తెలిసినవాళ్లు చెప్తున్నారు. తమను నమ్ముకున్నవాళ్లకు అండగా నిలవాలని ఆమె తపిస్తుంటుందని చెప్తారు. ఇప్పుడు ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో ఆమె ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: