బ్రిటీష్ వారి నిరంకుశ పరిపాలనలో మగ్గుతున్న భారత దేశ దాస్య శృంఖలాలు తెంచే వరకు శాంతిపోరాటమే తన ఆయుధంగా పోరాడిన మహనీయులు..జాతిపిత మహాత్మాగాంధీ. బ్రిటీష్ పాలకులకు తన శాంతి మంత్రంతోనే బెంబేలెత్తించిన మహాత్మాగాంధీ అంతరూ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు.
తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు. గాంధీ పెద్ద కుమారుడైన హరిలాల్ గాంధీ కుమారుడు కాంతిలాల్ గాంధీ అమెరికాలో సెటిల్ అయ్యారు..ఆయన కుమార్తే ఈ మేధా గాంధీ. ప్రస్తుతం మేధా డీజేగా తన సత్తాచాటుతుంది. భారత్ 71వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో మేధాగాంధీ ఇలాంటి దుస్తువులు ధరించడం ఏంటని గాంధేయవాదులు ప్రశ్నిస్తున్నారు.
అంతే కాదు వ్యంగ్యమైన ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. కామెడీ పోస్టులతోనూ సై అంటోంది. అయితే ఆమె ఓ పార్టీలో తన స్నేహితులతో దిగిన కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.