వ్యయం పెరిగిపోతోందని, కమీషన్ల కోసమే ప్రాజెక్టును ఆ కంపెనీకి అప్పగించారని విమర్శలు వినిపిస్తున్నా.. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బృహత్తర బాధ్యతను ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీకి అప్పగించారు ఏపీ సీఎం చంద్రబాబు! ప్రతి సోమవారం ఈ ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తు న్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్స్ట్రాయ్ కంపె నీకి నోటీసులు ఇచ్చారని.. టెండరు రద్దు చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ కేవలం భ్రమే అని తేలిపోయింది. పనులు అనుకున్న సమయానికి జరగకపోవడంతోపాటు.. మరో కాంట్రాక్టర్ ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఇప్పుడు చంద్రబాబులో టెన్షన్ మొదలైందట.
ప్రాజెక్టు వ్యయం అంచనాలకు మించిపోతున్నా సీఎం చంద్రబాబు వాటిని పట్టించుకోవడంలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిధులు విడుదల అడపాదడపా మాత్రమే విడుదల చేస్తోంది. దీంతో ప్రత్యేకంగా కొన్ని నిధులను పోలవ రానికి ప్రభుత్వమే కేటాయిస్తోంది. ఎలాగైనా 2019 ఎన్నికలకు ఇదే ప్రధాన ఎజెండాగా బరిలోకి దిగాలనే సంకల్పం తో ఉన్నారు చంద్రబాబు. 2018 చివరి నాటికి కాపర్ డ్యామ్ పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని పదే పదే ప్రకటిస్తున్నా రు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు `పోలవరం`లో చిక్కుకుపోయారని సీనియర్ అధికారులు కూడా చెబుతున్నారు.
పనుల్లో అలసత్వం వహిస్తోందన్న కారణంగా ట్రాన్స్ స్ట్రాయ్ కు నోటీసులు ఇచ్చింది.. అంతా తూచ్ అని తేలిపోయిం ది. నోటీసులు లేవు.. కాంట్రాక్ట్ రద్దు లేదని స్పష్టమైంది. మరి పోలవరంలో ముందడుగు పడేదెలా? ఇప్పుడిదే చంద్ర బాబుకు పెద్ద సమస్యగా మారింది. ట్రాన్స్ స్ట్రాయ్ ను అలాగే పెట్టి ఓ బడా కాంట్రాక్టర్ కు పని అప్పగిద్దామని ప్రయ త్రిస్తే.. ఆ కంపెనీ పేరు మీద ఉన్న పని తాను చేయనని తేల్చిచెప్పేశాడట. కొత్తగా టెండర్ పిలిస్తే ఓకే.. లేదంటే నాతో కాదు అన్నది ఆ కాంట్రాక్టర్ ఫైనల్ మాట. ట్రాన్స్ స్ట్రాయ్ కు నోటీసులు ఇచ్చి..టెండర్ రద్దు చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళుతుంది.
కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) నే కొత్త టెండర్ తో పాటు ప్రాజెక్టు పనులను పర్యవేక్షి స్తుంది. అది చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేని పని. ట్రాన్స్స్ స్ట్రాయ్ ను తప్పించకుండా పని జరిగేది ఎలా అనే అంశంపై సీఎం చంద్రబాబు సన్నిహితులు తర్జనభర్జనలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా చంద్రబాబే స్వయంగా పూనుకుని కొంత మంది సబ్ కాంట్రాక్టర్లను పెట్టి నడిపించినా పని పెద్దగా ముందుకు కదిలలేదు. ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేసి ఇచ్చేదని తెలిపారు. సాగునీటి శాఖలో ఏ అధికారిని అడిగినా ట్రాన్స్ స్ట్రాయ్ ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదనే చెబుతున్నారు. మరి అలాంటి కంపెనీని మార్చేందుకు చంద్రబాబు సాహసం చేయలేకపోతున్నారు!! సో అలా బాబును పోలవరంలో ట్రాన్స్ట్రాయ్ నిలువునా ముంచేసింది.