భారత దేశంలో గత కొన్ని రోజులుగా మహిళలు, యువతులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. భారత దేశంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు మహిళలు ధైర్యంగా ఎప్పుడైతే వెళతారో..అప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మగాంధీ అన్నారు. ఈ మద్య కాలంలో పట్టపగలు మహిళలు ఒంటరిగా సంచరించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా ముజఫర్నగర్లో ఘోరం జరిగిపోయింది. 16 సంవత్సరాల అమ్మాయిపై నలుగురు యువకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు.
ఓ కారులో నిర్భందించి.. తిప్పుతూ పది రోజులు తమ ఇష్టం వచ్చినట్లు బాలికపై పైశాచికంగా అత్యాచారం చేస్తూ వచ్చారు. అంతే కాదు తనపై అత్యాచారం చేయడమే కాకుండా బలవంతంగా మాంసం తినిపిస్తూ..మతం మార్చుకోవాలని హింసించినట్లు బాధితురాలు తెలిపింది. వివరాల్లోకి వెళితే..న్యూ మండి ప్రాంతంలోని కుక్రా గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 6 తేదీన బంధువు మామను కలిసేందుకు ముజఫర్నగర్ వెళ్లినట్లు తెలిపింది.
ఆ సమయంలో బస్టాండ్ లో బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఓ యువకుడు తాను కూడా ముజఫర్ నగర్ కి వెళ్తున్నట్లు బస్ రావడం ఆలస్యం అవుతుందని తన కారులో డ్రాప్ చేస్తానని చెప్పడంతో తెలిసిన వ్యక్తి అని కారు ఎక్కినట్లు బాధితురాలు తెలిపింది. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు తన తలపై గన్ పెట్టి బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్లు కొడుతూ..తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది.
కారులో తిప్పుతూ..తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.