భారత దేశంలో కొన్ని రోజులుగు ఎన్నో సంచలనాలకు కేంద్రంగా మారిన డేరా బాబా గుర్మిత్ రామ్ రహీమ్ ఇద్దరు సాద్విలపై అత్యాచారం చేసిన ఘటనలో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సదరు గుర్మిత్ బాబా లీలలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. ఆయన బాధితులు తెలిపే విషయాలు వింటుంటే ఒక్కొక్కరూ షాక్ అవుతున్నారు. ఇప్పటికే డేరా బాబా ఆశ్రమంలో అస్తి పంజరాలు బయట పడుతున్నాయని..ఆయన విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాడు పడ్డారని.
ఆశ్రమంలో ఎంతో మంది అమ్మాయిలను చిన్న పిల్లలను సైతం లైంగికంగా వేధించారని వారిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేరా బాబా ఆశ్రమంలో స్వలింగ సంపర్కులు ఉన్నారని సిర్సా ప్రధానాశ్రమంలో ఆరేళ్లు గడిపిన గుర్దాస్ సింగ్ తూర్ అక్కడి దారుణాలను వివరించారు. డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెద్ద కామపిశాచి అన్న విషయాన్ని మాజీ అనుచరులు స్వయంగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్దాస్ సింగ్ తూర్ ‘ఆశ్రమంలో మగవాళ్లకు కఠిన నియమాలు ఉండేవి.
గుర్మీత్ మహిళా భక్తుల(సాధ్వీలు)తో ఎవరూ మాట్లాడకూడదు. ఆశ్రమంలోని మహిళలను మాత్రమే చేరదీసే గుర్మీత్ అతని అనుచరుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండే వారట. తమ భార్యలను సోదరీమణులుగా భావించాలని తరచూ అనుచరులకు ప్రభోదించేవాడంట. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారంట.
గుర్మీత్ మహిళా భక్తుల(సాధ్వీలు)తో ఎవరూ మాట్లాడకూడదనే కఠిన నిబంధన ఉండేదని..ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే శిక్షలు కఠినంగా ఉండేవి. గాడిదల మీద ఉరేగించటం.. ప్రజల సమక్షంలోనే బాబా ప్రధాన అనుచరులు దాడి చేయించేవాడని అన్నారు. శిక్షలకు భయపడే చాలా మంది మహిళల వైపు కన్నెత్తి చూసేవారు కారని..కానీ యవ్వనంలో ఉన్న పురుషులు స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారంట.
ఓ రోజు ప్రార్థన మందిరంలోనే ఇద్దరు వ్యక్తులు అసహజ శృంగారం చేస్తూ తన కంటపడ్డారని, ఇదే విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేస్తే గుర్మీత్ నవ్వి ఊరుకున్నాడని గుర్దాస్ చెప్పాడు. అదృష్టం బాగుండి తనపై అలాంటి దాడులు ఏనాడూ చోటు చేసుకోలేదని గుర్దాస్ తెలిపాడు.