గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాలకు నాంది పలికిన ప్రొ.కంచె ఐలయ్య రాసిన పుస్తం ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’. భారత దేశంలో అన్ని రకాల కులాల వారు వడ్డీ వ్యాపారం చేస్తున్నారని, వ్యాపారాన్ని ఒక కులానికి అపాదించడం మంచిది కాదన్నారు. దీని వల్ల హిందూ దేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఇలాంటి రచనలు చేయడం తగదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అగ్రకులాల వారిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. నగరంలోని దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌరస్తాలో కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. కొన్ని రోజుల నుంచి కంచె ఐలయ్యపై పలువురు మాటల దాడికి దిగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నగరంలో 'సామాజిక సేవకులు వైశ్యులు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఐలయ్య పుస్తకానికి కౌంటర్గా 'సామాజిక సేవకులు వైశ్యులు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కంచె ఐలయ్య కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని, కంచె ఐలయ్యను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని మండిపడ్డారు. కంచె ఐలయ్య దేశద్రోహి..విదేశీ ఏజెంటన్నారు.
వైశ్యు లు సమాజానికి చేస్తోన్న సేవలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. కాగా, కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యుల నిరసన కొనసాగుతోంది. ఐలయ్య రాసిన పుస్తకంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.