ఈ మద్య భారత దేశంలో దొంగ బాబాలు చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. సంత్ ఆశారామ్ బాపు, గురు రాంపాల్ దాస్, బాబా జై గురుదేవ్.. గుర్మీత్ రామ్ రహీం తాజాగా ఫలహారీ బాబా లీలలు..వారి చేసిన దారుణాలు బయటపడుతున్నాయి.  కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా  ‘నా నాలుకపై తేనెతో ఓం అనే బీజాక్షరం రాస్తా.. నువ్వు దానిని నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది. చాలామందికి ఇలానే నాలోని జ్ఞానాన్ని ప్రసాదించాను’’ అని తనతో చెప్పి ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడని చత్తీస్‌గఢ్‌కు చెందిన 21 ఏళ్ల లా విద్యార్థిని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
Image result for ఆశారామ్ బాబా
ఆయన అనుగ్రహం పొందాలంటే నాలుకను నాకాల్సిందేనని పట్టుబట్టాడని తెలిపింది. బాబా తనను గదిలోకి పిలిచారని, తాను వెళ్లగానే శిష్యులను బయటకు పంపించి వేసి, తలుపులు మూసేశారని బాధితురాలు పేర్కొంది. తర్వాత తనను ఎక్కడెక్కడో తాకుతూ..గట్టిగా పట్టుకున్నారని, దీంతో తాను ఏమీ చేయలేక అచేతనంగా ఉండిపోయానని తెలిపింది.
Image result for ఆశారామ్ బాబా
భగవంతుడి ఆదేశాల ప్రకారమే ఇదంతా జరుగుతోందంటూ బలవంతం చేశారని వివరించింది.  లైంగిక దాడి తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు యువతి పేర్కొంది.  
Image result for ఆశారామ్ బాబా
తనకు జరిగిన ఘోరాన్ని కొన్ని రోజులపాటు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానని, చివరికి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపింది.  బాధితురాలి ఫిర్యాదుతో  కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా (60)ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: