ఉత్తర ప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకీ రాజుకుంటోంది. ఉత్తర ప్రదేశ్ లో రీసెంట్ గా జరిగిన అసంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన కొడుకు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్యన మొదలైన విభేదాలు సైలెంట్ గా ఉన్నా ఈ మధ్యన ఇవి రేగుతున్నాయి.
రెండురోజుల క్రితం పార్టీ లో జరిగిన సమావేశానికి ములాయం ని కానీ ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ ని కానీ పిలవలేదు సో ఇప్పుడు పార్టీ లో చీలిక తీసుకొచ్చే ఐడియా లో ములాయం ఉన్నట్టు చెబుతున్నారు.
‘లోక్దళ్’తో కలిసి నేడు (సోమవారం) ఆయన కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి ఈ ముహూర్తం ఉంది అంటున్నారు. పాతికేళ్ళ క్రితం ములాయం సమాజ్ వాదీ పార్టీ ని స్థాపించారు. తన సొంత పార్టీ లోని తన సొంత మనుషులే తనకి ద్రోహం చేస్తున్నారు అని వాపోతున్న ములాయం కొత్త పార్టీ దిశగా నడిచేలా కనిపిస్తోంది.