పరిటాల సునీత – పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి వైభవంగా జరుగుతోంది. అనంతపురం జిల్లాలోని స్వగ్రామం వెంకటాపురంలో జరుగుతున్న వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. కుమారుడి పెళ్లిలో తల్లి సునీత కంట కన్నీరు ఆగడం లేదు. ప్రతిక్షణం భావోద్వేగానికి లోనవుతున్నారు.

Image result for paritala wedding

          పరిటాల శ్రీరామ్ పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పరిటాల సునీత. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికి హాజరవుతున్నవారందరినీ మంత్రి సునీత ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. పేరుపేరునా పలకరిస్తున్నారు.

Image result for paritala wedding

          పెళ్లి మండపానికి శ్రీరామ్ రాగానే సునీత భావేద్వోగానికి లోనయ్యారు. కుమారుణ్ణి చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చేందుకు చాలా మంది ప్రయత్నించారు కానీ ఆమె కంట కన్నీరు ఆగలేదు. చివరకు శ్రీరామ్ తన పక్కన కూర్చోబెట్టుకుని చెయ్యి పట్టుకుని ఓదార్చారు. కర్చీఫ్ ఇచ్చి కన్నీరు తుడిపించారు. అయినా ఆమె భావోద్వేగం ఆగలేదు. మరోవైపు శ్రీరామ్ తమ్ముడు కూడా అమ్మ భుజంపై చేయి వేసి ఓదార్చారు. భావోద్వాగానికి లోనవుతూనే అతిథిలను ఆహ్వానించడంలో సునీత బిజీబిజీగా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: