భారత వైమానిక దళంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు వ్యక్తులు మరణించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద పైలట్లకు శిక్షణ ఇచ్చే విమానం ఒకటి సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ లో ఏడుగురు వ్యక్తులు ఉండగా అందులో ఐదుగురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ ఉదయం ఎయిర్ మెయింటెనెన్స్ మిషన్ నిర్వహిస్తుండగా ఓ ట్రైనీ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం సంబవించడంతో హఠాత్తుగా ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో ఉన్న వైమానికి సిబ్బంది తప్పించుకోవాలనే ప్రయత్నం చేసేలోగా ప్రమాదం జరిగింది. ఇండో చైనా సరిహద్దులో జరిగిన ఈ ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. ఈ మద్య కాలంలో వైమానిక హెలికాప్టర్ లు ప్రమాదానికి గురవుతుండటంతో విచారణ జరిపించనున్నట్లు ఐఏఎప్ అధికారులు ఉన్నతాధికారులు తెలిపారు.