బడుగు బలహీన వర్గాలకు తామెంతో సేవ చేస్తూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామంటున్నాయి కొన్ని ప్రభుత్వాలు. వీటిలో నిజమెంత అనేది ప్రధాన ప్రశ్న. "మాటలు కోటలు దాటినా, చేతలు వాకిలి వీడనే" సామెతను నిజం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నామని వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నామని పదే పదే డప్పుకొట్టుకుంటున్న తెలుగు దేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడి పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు.

Image result for KVPS general secretary andra malyadri


అధినేతే ఒక సందర్భం లో "దళితుడు గా పుట్టాలని ఎవరనుకుంటారు?"  అంటూ సంభాషించారు. అలాగే ఇప్పటికే టిడిపి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇటీవల ఎస్సీ - ఎస్టీలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. "ఎస్సీలకు స్నానం చేయడం రాదని, గబ్బు కొడుతుందని అందుకే చదువు రాదని"  ఇలా వారిపై తన అక్కసు వెళ్లగక్కారు. దీంతో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.


ఇక అసలు కథేమంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాద రావు తానే స్వయంగా దళితులకు వ్యతిరేఖంగా  కేంద్రానికి లేఖ రాశారనే వివాదం పై అగ్గి రాజు కుంది. దళితులకు కోసం కేటాయించిన కళాశాల సీట్ల విషయంలో ఆయన పెను వివాదానికి తెర లేపారు. దీంతో దళితులు ఇప్పుడు ఉద్యమాలకు ఉద్యుక్తులౌతున్నారు. 


Image result for kodela siva prasada rao


గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని 'కేంద్రీయ విద్యాలయం' లో ఈ ఏడాది ఎస్సీ - ఎస్టీ సీట్లు మిగిలిపోయాయి. దీంతో అలా మిగిలిన సీట్లను  ఇతరులకు కేటాయించాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు కోడెల శివ ప్రసాద రావు లేఖ రాశారు. వాస్తవానికి ఇటు ఉద్యోగాల్లో కానీ - అటు కేంద్రీయ విద్యాలయాల్లో కానీ ఎస్సీ - ఎస్టీలకు కేటాయించిన సీట్లు మిగిలిపోతే.. వాటిని తిరిగి వారికే కేటాయించి - విద్యా విషయాలపై వారికి మరింత అవగాహన కల్పించి భర్తీ చేయాలి.  కానీ, కోడెల శివప్రసాద రావు అలా చేయకుండా,  మిగిలిపోయిన సీట్లను ఇతర కులాలవారికి కేటాయించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామంపై  "కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం" (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఘాటు గా స్పందించారు.


ఢిల్లీలో అక్టోబర్ 10న స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారని ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదని అన్నారు. తన నియోజకవర్గ పరిధి లోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ - ఎస్టీ విద్యార్థుల సీట్లు ఎందుకు మిగిలిపోయాయో ఆలోచించి వారిని చేర్చేలా తగిన చర్యలు తీసుకోవడానికి బదులు. మిగిలిన సీట్లన్నీ ఇతరులకు లాటరీ పద్ధతి లో కేటాయించేలా జీవో ఇవ్వాలంటూ విన్నవించడం 'దళిత వ్యతిరేక చర్య' తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.


సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో సీట్లు మిగిలి పోవడానికి ప్రభుత్వ ప్రచారం లేకపోవడమే కారణమన్నారు. ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా వున్న స్పీకర్ శివప్రసాద రావు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి దళిత కాలనీలకు వెళ్లి కేంద్రీయ విద్యావిధానంపై అవగాహన కల్పించలేకపోయారని వారిని ఆ విద్యా లయంలో చేర్చేలా చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు.  అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ లో ఉన్నత  స్థానాల్లో అంటే ముఖ్యమంత్రి, శాసనశభ సభాపతి, మంత్రి, దళితులను ఎలా సంరక్షించి అభివృద్దిలోకి తీసుకురాగలదని అనుకుంటామని?  దళితులు ప్రశ్నిస్తున్నారు.

Image result for kodela siva prasada rao caste politics

మరింత సమాచారం తెలుసుకోండి: