ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సన్నాహాలు ఎంత హడావిడిగా ఉన్నాయో మరొక పక్క టీడీపీ వ్యూహాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటున్నారు. పాదయాత్ర అంటే జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఆయా జిల్లాలకి సంబంధించి చాలా మంది నాయకులు నడుస్తారు. జగన్ యాత్ర ఏ జిల్లాలోకి వస్తే ఆ జిల్లాలో జరగాల్సిన కార్యక్రమాల కి సంబంధించి అంతా సిద్ధం చేసింది వైకాపా.

అధికార తెలుగుదేశం ఇంతకంటే ఎక్కువ ప్లాన్ లే వేస్తోంది అని విశ్వసనీయ సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల ఓటమి దగ్గర నుంచీ వైకాపా లో నుంచి జంపింగ్ ఎమ్మెల్యే లు అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారు అంటూ టీడీపీ హడావిడి చేస్తూనే ఉంది. మొన్నామధ్య వైకాపా ఎంపీ బుట్టా రేణుక దాదాపు గా టీడీపీ లోకి వెళ్ళిపోబోయిన పరిస్థితి కూడా ఉంది.

జగన్ పాదయాత్ర మొదలు కాగానే టీడీపీ లోకి వైకాపా ఎమ్మెల్యే ల వలసలు ఉండేలా టీడీపీ సూపర్ ప్రణాళిక రచించింది అని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ యాత్ర అనంత‌పురం వెళ్ల‌గానే అక్కడి వైకాపా నుంచి కూడా ఓ ప్ర‌ముఖ నేత‌ను చేర్చుకునే షెడ్యూల్ దాదాపు ఖ‌రారైంద‌నే తెలుస్తోంది! వీలైన‌న్ని జిల్లాలో ఇదే త‌ర‌హాలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టేందుకు టీడీపీ వ్యూహ ర‌చ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

జగన్ ఇంకా యాత్ర మొదలు పెట్టకుండానే టీడీపీ నేతల నుంచి విమర్సల వర్షం ఎక్కువ అయ్యింది. జగన్ పాదయాత్ర దగ్గర అవుతున్న కొద్దీ ఆయన మీద ఉన్న  కేసుల గురించి పెద్ద పెద్ద నాయకులే డిస్కషన్ లు పెట్టేసారు . ఇక ఈ కొత్త ప్రణాళిక తో జగన్ యాత్ర మొదలు అవ్వగానే ఆయా జిల్లాల వారిని ఆ టైం లో వలసలు చేయించి జగన్ ని మానసికంగా , స్థైర్యం తో సహా దెబ్బ తీయాలి అనేది టీడీపీ ప్లాన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: