తమిళనాడులోని నాగపట్టినమ్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.  రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లా పొరయూర్ లోని ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్ డిపో గ్యారేజ్ కుప్పకూలింది.  బస్‌డిపో గ్యారేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో…ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
#
హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి అందరూ షాక్ కి గురికావడం..ఒక్కసారే జనాలు చెల్లచెదురయ్యారు  ఘటనాస్థలానికి చేరుకున్న రెస్యూ టీం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భవనశిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఆ మద్య భారీ వర్షాలకు బాగా నానిపోయిన బస్ షల్టర్ కూలిన ఘటనలో పలువురు తీవ్ర ప్రమాదానికి గురయ్యారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: