ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఓ వైపు రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కొన్ని సార్లు డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్య తాగి వాహనాలు నడిపడం లాంటి చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి అనుకోని సంఘటనల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయి.
తాజాగా తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాణిపాకంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ రెడ్డి , ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు.
రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్దలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.