తెలంగాణలో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు నరయ యాతన అనుభవించారు.  రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడటకపోవడంతో కాస్త ఊరట చెందుతున్నారు.  తాజాగా హైదరాబాద్ నగరంలో ఇవాళ తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది.
Mild earthquake hits Hyderabad
యూసఫ్‌గూడ  చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతాలు స్వల్పంగా కంపించాయి.  రహ్మత్‌నగర్ డివిజన్‌లోని హెచ్‌ఎఫ్ నగర్, ఇందిరా నగర్, ప్రతిభా నగర్ ప్రాంతాల్లో ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో భూమి కంపించినట్లు చెపుతున్నారు.  కాకపోతే ఈ భూకంపం చిన్న స్థాయిలో రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

భూప్రకంపనల వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.భూమి కంపించిన ప్రాంతాల్లో ఎమ్మార్వో సైదులు, కార్పొరేటర్ షఫీ పర్యటించి స్థానికుల నుంచి వివరాలను సేకరించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: