టీడీపీ పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తోంది. వైసీపీని నీరుగార్చేందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది. జగన్ ఎల్లుండి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేసేందుకు టీడీపీ వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగా ఇవాళ తొలి అడుగు వేసింది. ఓ ఎమ్మెల్యేని తన గూటికి లాక్కుంటోంది.

Image result for vantham rajeswari

          వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పాదయాత్ర సజావుగా సాగేందుకు జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. తిరుమలేశుడిని దర్శించుకుని ఆలయం నుంచి అలా బయటకు వచ్చారో లేదో.. ఆయనకు చేదు వార్త వినిపించింది. వైసీపీకి చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతం రాజేశ్వరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారనేది ఆ సమాచారం. దీంతో జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Image result for rampachodavaram mla

          వైసీపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ చెప్తూ వస్తోంది. అయితే తామే పార్టీలో చేర్చుకోబోవట్లేదని చెప్పింది. అయితే జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ కు మళ్లీ తెరలేపినట్లయింది. అందులో భాగంగానే మొదట రంపచోడవరం ఎమ్మెల్యే వంతం రాజేశ్వరితో యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. వాస్తవానికి రాజేశ్వరి చాలా కాలం క్రితమే పార్టీ మారుతోందనే ఊహాగానాలు వినిపించాయి.

Image result for rampachodavaram mla

          జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యే లోపే మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇటీవలే కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆరో తేదీ ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ లోపు మరికొంతమంది టీడీపీలో చేరుతారని సమాచారం. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: