గత కొంత కాలంగా అమెరికాలో జరుగుతున్న దారుణమారణకాండ చూస్తుంటే..అక్కడి ప్రజలు ఎంతగా విల విలలాడుతున్నోరో అర్థమవుతుంది.  ఓ వైపు ప్రకృతి బీభత్సం సృష్టింటే..మరోవైపు ఉగ్రవాదులు, ఉన్మాదులు రెచ్చిపోయి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.  గత వారంలో రెండు సార్లు ఉగ్రవాదులు పలు రకాలుగా విద్వంసం సృష్టిస్తే..తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు విచక్షణరహిత కాల్పులకు దిగాడు.

ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.  క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.   ఈ ఘటన వెనుక ఉగ్రసంస్థల కుట్ర ఏదైనా ఉందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఉన్మాది కేవలం 15 సెకన్లలోనే ఇంతమందిని పొట్టనబెట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న ఆగంతుకుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. దుండగుడు గతంలో అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన కెల్లీగా అధికారులు గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: