నాగర్ కర్నూలు జిల్లాలోని రాజు అనే కుర్రాడు చనిపోయే ముందర ఒక సేల్ఫీ వీడియో ని రికార్డ్ చేసాడు. ఈ కుర్రాడికి ఏడేళ్ళ క్రితం అదే ప్రాంతానికి చెందిన ఒకమ్మాయి తో పెళ్లి జరిగింది. చిన్న చిన్న గొడవల కారణంగా వారిద్దరి మధ్యనా గొడవలు మొదలు అయ్యాయి.


ఆమె తో మాట్లాడి ఇంటికి తెచ్చుకోవడం కోసం ఆమె ఇంటికి వెళ్ళాడు ఇతను. దీనిని ఛాన్స్ గా తీసుకున్న ఆమె బంధువులు రాజు మీద దాడి చేసారు. దీనికి అతను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు.దీంతో రాజును ఎస్సై సైదాబాబు, ఇతర పోలీసులు చితక్కొట్టారు.




తాను చేసిన తప్పేంటి? అని నిలదీయడంతో కేసీఆర్, చంద్రబాబు చంపేయమన్నారని, అందుకే కొడుతున్నామని ఎస్సై సమాధానం చెప్పాడని బాధితుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను బట్టలిప్పించి గొడ్డును బాదినట్టు బాదారని కన్నీటిపర్యంతమయ్యాడు.


ఆ దెబ్బలకు నడవలేకపోతున్నానని, తొడలు కమిలిపోయాయని, ఇదేం న్యాయమని అడిగాడు. పోలీసులు ఇలాగేనా వ్యవహరించేది? అని నిలదీశాడు. మహిళలు కూడా ఆలోచించాలని, వారిది కూడా తప్పు ఉంటుందని, తప్పంతా మగాళ్ల మీదే తోసేయడం సరికాదని హితవు పలికాడు. అలా చెప్పి వెంటనే పురుగుల మందు తాగి చనిపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: