ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెట్టుకున్న అతిపెద్ద టార్గెట్ లలో ఒకటి ఈ పోలవరం వ్యవహారం. అనుకున్న టైం లో ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలి అంటూ చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ వారం క్రమం తప్పకుండా ఆయన పట్టుదల తో సమీక్షలు సైతం నిర్వహిస్తూ ఈ పని మీద దృష్టి పెట్టారు. మరొక పక్క డిల్లీ కి వెళ్లి పోలవరం నిధుల గురించి మాట్లాడి వస్తున్నా అంటూ చెబుతున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం చంద్రబాబు పెట్టుకున్న లక్షిత సమయానికి పోలవరం పనులు పూర్తిచేయడం అనేది సవాలే.
ఈ ప్రాజెక్టు విషయమై ఏపీ సర్కారు వాణి ఈ మధ్య కాస్త మారిందనే చెప్పాలి! కాపర్ డామ్ విషయంలోనూ, జలవిద్యుత్ కేంద్రం అంశంలోనూ, డిజైన్ల ఫైనలైజ్ వ్యవహారంలోనూ ఆశించిన స్థాయిలో కేంద్ర సర్కారు సహకారం అందడం లేదనే వాదనను వినిపిస్తున్నారు. పోలవరం సరైన టైం లో పూర్తి అవ్వకపోతే కేంద్రం మీద నెట్టడం కోసం రంగం సిద్ధం అవుతోంది అంటున్నారు.
అయితే ఈ ప్రయత్నం బీజేపీ కి క్లియర్ గా ఎప్పుడో అర్ధం అయిపోయింది. ముందస్తు జాగ్రత్తగా తమా వాదన తాము కూడా సిద్దం చేసుకుంటున్నారు. పోలవరం కోసం కేంద్రం కరక్ట్ ప్రయత్నం చేస్తున్నా కూడా రాష్ట్రం తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఓపెన్ గా చెబుతున్నారు బీజేపీ నాయకులు.
కేంద్రంతో సరైన విధంగా సంప్రదింపులు జరిపితే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యే అవకాశమే లేదన్నారు ఏపీ భాజపా నాయకురాలు పురందేశ్వరి. చంద్రబాబు ఆయన ప్రభుత్వం కేంద్రం ని బద్నాం చెయ్యాలి అనుకున్న ప్రతీ సారీ తాను రంగంలోకి దిగి చంద్రబాబు కి చెక్ పెడతా అని ఇప్పటికే కేంద్రం దగ్గర పురందరేశ్వరి మాట ఇచ్చినట్టు సమాచారం.