తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సీనీ రంగ ప్రవేశం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తన సత్తా చాటుతున్నారు. చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది పవన్ కళ్యాన్ ఒక్కరే. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్కు ‘ఇండియా-యూరోపియన్ బిజినెస్ ఫోరం’ ఎక్స్లెన్సీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ అవార్డు అందుకునేందుకు ఆయన లండన్ వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున పవన్ లండన్ చేరుకున్నారు.గతంలో ఓ ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయంలో వెళ్లి పవన్కల్యాణ్ ఉపన్యాసం ఇచ్చాడు. ఆ సందర్భంగా అక్కడ పవన్కల్యాణ్ అభిమానులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు.
బ్రిటన్లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్కల్యాణ్కు అవార్డును ప్రదానం చేయనున్నారు. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను పవన్ ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. రెండు రోజులపాటు లండన్ లో ఉండే పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.