అనంతపురం ప్రాంతంలో జేసీ బ్రదర్స్ కి ఉన్న వర్గం తమ పంతం నెగ్గించుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ ప్రాంతంలో వీరి హవా అంతా ఇంత కాదు, వారి కనుసన్నల్లో అక్కడ పరిస్థితి ప్రజలు వుండాలి అనే వారు ఎప్పుడు పెత్తనం చలాయిస్తూ వుంటారు.
ఈ క్రమంలో వారు విపక్ష వైకాపా నేతల మీద అనేకసార్లు ఇప్పటికే దాడులకు తెగబడ్డారు. మళ్ళీ కొత్తగా తమ మాట వినలేదు అనే కోపంతో వైకాపా నేతల నీళ్ళ మీద దాడిచేసి ఇళ్ళు అన్యాయంగా కూల్చేశారు అని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది .ఇంతకీ విషయం ఏంటి అంటే, రీసెంట్గా అనంతపురంలో దారుణమైన హత్యకి గురైన వైకాపా నేత విజయ్ భాస్కర్ రెడ్డి కేసులో జేసీ బ్రదర్స్ హస్తం ఉంది అనే ఆరోపణలు ఉండడంతో వారి వర్గంలో కొందరి మీద ఇప్పటికే కేసులు నమోదు చేశారు.
అయితే ఈ కేసుల విషయంలో రాజీకి రావాల్సిందే అంటూ ఒత్తిడి పెంచుతున్నారు జేసీ వర్గం వారు. దానికి వైకాపా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. ఏ విషయమైనా న్యాయస్థానంలో తేల్చుకుంటామని వైకాపా నేతలు క్లియర్ గా చెప్పారు. ఈ విషయంలో అనేకసార్లు బెదిరించి , బామాలి ఇప్పుడు అవకాశం లేక ఇళ్ళమీద దాడులు చేస్తూ తెలుస్తోంది .
ఆక్రమణలు తొలగిస్తుంది అనే వంక చెప్పి వైకాపా కార్యకర్తలకు చెందిన ఐదు ఇళ్ళు వీళ్ళు ఇప్పటికే కూల్చేశారు .హంతకులకు వ్యతిరేకంగా సాక్షం చెప్తామనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైసీపీ నేతలు వెల్లడించారు. ఇదిలావుంటే జేసీ కార్యకర్తలు తమ ఇళ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు ఆరోపించడం గమనార్హం.