నంది వార్డులకు సంబంధించి ఇప్పటికే తెలుగు సినిమా వర్గం మొత్తం కూడా 2 విభాగాలుగా చీలిపోయారు అనిపిస్తోంది . ప్రతి టీవీ ఛానల్ లో ఇప్పటికే నంది  అవార్డ్స్ కి సంబంధించి తీవ్రమయిన చర్చలు కార్యక్రమాలు, ఓపెన్ డిబేట్లు నడుస్తున్నాయి. ఒకానొక సందర్భంలో కొందరు వ్యక్తుల మధ్య వాదోపవాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.


ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనపడ్డం లేదు. తాజాగా నంది అవార్డు వివాదానికి సంబంధించిన హీరో శివాజీ తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్ర ప్రసాద్ తో పాల్గొన్నారు . వీరిద్దరూ అనేక అంశాల మీద మాట్లాడుతూ నంది అవార్డ్స్ దగ్గరకి వచ్చే సరికి పెద్ద యుద్ధమే చేసారు.. విషయం ఎంత వరకూ వెళ్ళింది అంటే మధ్యలో యాంకర్ కలదు చేసుకుని ఇద్దరిని కంట్రోల్  చేయాల్సిన పరిస్థితి కనపడింది . ఇదివరకు కన్నా  తాను ఈమధ్య చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నానని అన్నారు శివాజీ.


మరొక పక్క  తెలుగులో ప్రతి హీరోకు సొంతగా  ట్రస్ట్ లు  ఉన్నాయి అని చెప్పిన రాజేంద్ర ప్రసాద్.. ట్రస్టులు అన్ని ఇంకం  టాక్స్ నీ ఎగ్గొట్టడం కోసమే ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పుకొచ్చారు . ఈ మాటలు  టీవీ ప్రోగ్రాం లో తీవ్ర అసహనాన్ని రేప్ రేపాయి. హీరో శివాజీ వెంటనే రాజేంద్రప్రసాద్ మాటలకి ఫైర్ అయ్యారు. రాజేంద్రప్రసాద్ అన్న మాటలు విన్న  శివాజీ నాడు ఎన్టీఆర్ కూడా ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టేందుకే ట్రస్ట్ ఏర్పాటు చేసారా? అని రివర్స్ లో  ప్రశ్నించారు. అయితే  ఎన్టీఆర్ పెట్టింది ట్రస్ట్ కాదని అది రాజకీయ పార్టీ అని బాబూ రాజేంద్రప్రసాద్...తన వ్యాఖ్యలను  సమర్ధించుకోబోయారు.


ఎన్టీఆర్ ట్రస్టు  తో ఇతర ట్రస్టులను పోల్చవద్దని ఎన్టీఆర్ ఎవరికీ సరిరారు అనే రాజేంద్రప్రసాద్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇలా వారిద్దరి మధ్యన మాటల తూటాలు చాలాసేపు పేలాయి యాంకర్ సరదాక పోయె ఉంటే విషయం ఎంతవరకు వెళ్లేదే చెప్పలేని పరిస్థితి . మొత్తంమీద  ఇతర హీరోలు అయినా చిరంజీవి మహేష్ బాబు ఇలాంటి వారిని ఇంకం టాక్స్  విషయంలో ఇరికించ బోయి  సీనియర్ ఎన్టీఆర్ ప్రేమగా పెట్టుకున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ కే  ట్రస్టు కె చెడ్డపేరు వచ్చేలా చేస్తున్నారు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్.


మరింత సమాచారం తెలుసుకోండి: