గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.  ఎంతో కాలంగా టీడిపీలో కొనసాగుతున్న ఆయన ఈ మద్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.  ఈ మద్య  సీఎల్పీ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. 

సోమజిగూడ యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ అయినట్లు గుర్తించారు. దీంతో జానారెడ్డిని ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కలిశారు.  జానారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితికి కాస్త మెరుగైనట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: