ఈ మాట అంటుంది ఎవరో కాదు తమిళ తంబీల ఆరాద్య దైవం సూపర్ స్టార్ రజినీకాంత్. త కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ప్రహసనం, జయలలిత మరణం తో ఊపందుకున్న ఊహాగానాలకు ఒకే సారి తెర దించేసాడు రజినీ కాంత్.ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన పెట్టుకోలేదని స్పష్టం చేసాడు రజినీ కాంత్. ఆ మద్య విశ్వనటుడు కమల్ హాసన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు..కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నానని వెల్లడించారు.
ఇదే సమయంలో తన సహనటుడు రజినీ కాంత్ కూడా రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు..తాను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పారు. దీంతో తమిళనాడు లో కొత్త రాజకీయ శకం మొదలవుతుందని అందరూ భావించారు. కానీ 'ఆ దేవుడు శాసిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు. రజినీకాంత్ హిట్ సినిమా అరుణాచలంలో సూపర్ హిట్ డైలాగ్ ఇది.
నువ్వు తమిళుడివి కాదు మా రాష్ట్రం విడిచి వెళ్లిపో అన్నారని, కానీ నేను పక్కా తమిళుడినే అంటూ చేసిన ప్రసంగం దాదాపుగా ఒక పూర్తి స్థాయి రాజకీయ ప్రసంగాన్నే తలపించింది. మరోవైపు దేశ రాజకీయాలపై కూడా రజినీ ఆసక్తికర వ్యాఖ్యలే చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 12న రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలను రజనీ ఖండించారు.
ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తిలేదన్నారు. రాజకీయాలు అధ్వాన్నంగా తయారయ్యాయని, దేశం భ్రష్టుపట్టిపోయిందని, దీన్నిమార్చాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో కూడా మార్పు రావాలని అప్పుడే దేశం బాగుపడుతుందని అన్నారు.