ఈ మద్య కొంత మంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదిక చేసుకొని ఫేక్ కాల్స్, మెయిల్స్ చేయడం చేస్తు జనాలను ఇబ్బందులు పెడుతున్నారు. సెలబ్రెటీలకు కూడా ఇలాంటి బాధలు తప్పడం లేదు. ఇక విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. నేను ఏసీబీ అధికారిని.. మీ వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది.అందుకు సంబంధించిన వివరాల ఫైల్ ఏసీబీ కార్యాలయంలో ఉంది. వివరాలు కావాలంటే నా ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు వేయండి' మెయిల్స్ పంపాడు.
డబ్బులు అడుగుతూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని, తనకే కాక చాలామంది ఎంపీలకు డబ్బుల కోసం బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని చెప్పారు. ఫేక్ కాల్స్, మెయిల్స్ పై బ్యాంకులు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఎంపి హోదాలో ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటీ అని ఎంపీ గీత ప్రశ్నిస్తున్నారు.
ఈ మద్య సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయని..కాస్తో కూస్తో చదువుకున్న వాళ్లు ఇలాంటి తెలితక్కువ పనులు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇటీవల తన కుమారుడి అకౌంటు నుంచి రూ. 12 వేలు మాయమయ్యాయని.. ఎనిమిది నెలలైనా బ్యాంకుల నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. సైబర్ క్రైమ్ అంశాలపై పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తుతానన్నారు.
సైబర్ క్రైమ్ చట్టాన్ని పటిష్టం చేయాలని పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతానని గీత చెప్పారు. సైబర్ క్రైమ్ ఘటనలను కేంద్ర హోం మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టు తెలిపారు. బెదిరింపు మొయిల్స్తో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ కమిషనర్ ఈ సంఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.