మొదట్నించీ దక్షిణాది వారంటే ఉత్తరాది వారికి చిన్నచూపే. మద్రాసీల అనే పేరే దక్షిణాదికి పర్యాయపదంగా వాడడం సర్వసాధారణమై పోయింది. మహరాష్ట్ర మాఫియా ముఠాల పోరువెనుక కూడా ఈ తరహా వివాదలు వున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం విషయంలొ కూడా అదే తీరు. మొదట్నించీ ఉత్తరాది పరిశీలకులు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పరిశీలిస్తూ వస్తున్నారు.తెలంగాణా వ్యవహారం వచ్చేసరికి, కొన్నాళ్లు పరిశీలకుడిగా వున్ని వీరప్ప మొయిలీ ఎక్కడా కనిపించకపోవడం గమనించాలి. ఆయన కర్ణాటకకు చెందినవాడు. మహరాష్ట్రకు చెందిన షిండే, మధ్యప్రదేశ్ కు చెందిన దిగ్విజయ్ సింగ్, కాశ్మీర్ కు చెందిన అజాద్, ఈ వ్వయహారంలో ముఖ్య భూమిక వహించారు.
గడచిన పాతికేళ్ల కాలంలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నది వాస్తవం. చంద్రబాబు విజన్ కావచ్చు, వైఎస్ అందిచిన చేయూత కావచ్చు, భౌగోళిక రీత్యా కీలక స్థానంలో వుండడం కావచ్చు,హైదరాబాద్ వాణిజ్యంగా పెరుగుతోంది. ఇది సహజంగానే వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నాయకులకు కన్నెర్ర అవుతోంది. దేశానికి రెండో రాజధానిగాహైదరాబాద్ సెట్ అవుతుంది అన్న ఆంబేద్కర్ వాఖ్యలు గుర్థుకు వచ్చి ఉత్తర భారత నాయకులంతా కిందామీదా పడుతున్నారు. ఇలాంటి కుట్రలో ఉత్తరాది పార్టీ అయిన బిజెపి కూడా తన వంతు పాత్రను పోషించింది. దీనివల్ల హైదరాబాద్ అభివృద్ది కుంటుపడి ఉత్తర భారత నగరాలతో పోటీకి దిగేది కల్ల.
అందుకే కాంగ్రెస్ నాయకులు, తమ పార్టీ నాయకులకు ముందుగా సమాచారం ఇచ్చి, చీలకకు శ్రీకారం చుట్టారు. తద్వారా నాయకులకు సబంధించి తాము ఎంత మంచివారమో అని చాటుకున్నారు.
చంద్రబాబు వ్యూహ మేంటి
మారిన పరిస్థితుల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు అనుసరించనున్న వ్యూహం ఏంటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంత శ్రమించి చేసిన పాదయాత్ర, ఎంతోకష్టపడి, డబ్బులు పెట్టి పడ్డ ఉత్తరాఖండ్ వెళ్లి పడిన శ్రమ వృధా అవుతుంటే ఆయన మౌనంగా ఉంటారా... లేదా మరే వ్యూహాన్నయినా రచిస్తారా అన్నది చూడాల్సి వుంది.
ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు చూస్థుంటే తెలంగాణ ప్రకటించడం, టిఆర్ఎస్ ను కూడా విలీనం చేసుకుంటుంటడంతో ఇక్కడ కాంగ్రేస్ అధికారంలో రావడం ఖాయమనే వాతావరణమేకనిపిస్థోంది. తెలంగాణలోనే ఎక్కువ పట్టున్నదని భావిస్తున్న టిడిపి ఏంచేసినా ఈ సెంటిమెంటును అదిగమించడం కష్టం.... పైగా ఇప్పటికే తెలంగాణలో పార్టీ సీనియర్లయిన నాగం,కడియం, వేణుగోపాలచారి వంటి వారెందరో పార్టీని వీడారు. అందుకే చంద్రబాబు ఏంచేస్థారన్నదే అసలైన ప్రశ్న.
అలాగే సీమాంధ్రలో ఇప్పటికే టిడిపి కంటే ఎక్కువ బలం ఉందని ఉప ఎన్నికల ద్వారా జగన్ రుజువు చేసుకున్నాడు. సర్వేలు కూడా అదే చెప్పాయి, అంతే కాదు ఇప్పుడు తెలంగాణవిభజన ప్రకటన నేపథ్యంలో సమైక్యాంధ్రవైపు ఔట్ రైట్ గా దిగి ఆ ప్రాంతంలో తిరుగులేని ప్రజలమద్దతు పొందారని కూడా ఇప్పటి ఆందోళనల్లో వైసీపి నుంచి అందుతున్న మద్దతును బట్టితెలుస్తోంది. పైగా ఆందోళనకారులు కూడా చాలా సంధర్బాల్లో తెలుగుదేశం వైఖరిని దుమ్మెత్తి పోసారు. అంటే కొత్తగా నెలకొన్న పరిస్థితులు చంద్రబాబును దెబ్బతీయగా, ఇప్పటినే ఆయనకంటే బలంగా ఉన్న వైఎస్సార్ సిపి ని మరింత బలోపేతం చేసినట్టుగా కనిపిస్థున్నాయి. అందుకే రెంటికి చెడ్డ రేవడిలా తయారైనట్టు కనిపిస్థున్న పరిస్థితి నుంచి చంద్రబాబు ఎలా బయటపడతాడా అన్నదే అందరి మదిని తొలుస్థున్న ప్రశ్న.