భగవంతుడు తన రూపానికి ప్రతిరూపంగా అమ్మను సృష్టించారని..ప్రపంచంలో మాతృమూర్తిని ఎంతో గౌరవం ఇస్తారు. కానీ ఈ మద్య కొంత మంది తల్లులు తమ పిల్లల పట్ల చేస్తున్న రాక్షసత్వం సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి..అసలు వీరి తల్లులేనా అని అసహ్యం కలుగుతుంది. తాజాగా అభం శుభం తెలియని చిన్నారి పట్ల ఓ తల్లి అమానవీయంగా ప్రవర్తించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కుమార్తెను తల్లి చిత్రహింసలకు గురి చేసింది.
ప్రియుడితో కలిసి వేడి పెనంపై చిన్నారిని కూర్చోపెట్టి తీవ్రంగా గాయపరిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలిత, ప్రకాశ్ మధ్య గత కొన్ని నెలల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతుంది. లలితకు రూప(4) అనే కూతురు ఉంది. ప్రకాశ్కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అయితే వీరిద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకోవడంతో.. కొన్ని నెలల క్రితం పారిపోయి హైదరాబాద్కు చేరుకున్నారు.
భార్యాభర్తలమని చెప్పి ఎస్సార్ నగర్లోని ఓ హాస్టల్లో పనికి కుదిరారు. లలిత వంట మనిషిగా, ప్రకాశ్ వాచ్మెన్గా పని చేస్తున్నారు. ఆయితే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని లలిత.. తన కూతురు రూపను వేడి పెనంమీద కూచోబెట్టడంతో ఆ చిన్నారి పిరుదులు, కాళ్ళు కాలిపోయాయి.
దీనికి తోడు చిన్నారిని వదిలించుకోవాలని కుట్ర చేశారు. వారి పాపం పండి ఈ అమానుష వైనం బయటకు పొక్కడంతో లలితను, ప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిని యూసుఫ్ గూడలోని శిశు విహార్ కు తరలించారు.