ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ను మరోసారి ప్రక్షాళన చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలకు మరో యేడాదికి కాస్త అటూ ఇటూగా టై ఉంది. ఈ యేడాది ఆరంభంలోనే తన కేబినెట్ను ప్రక్షాళన చేసిన చంద్రబాబుకు కొందరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి కేబినెట్లో మార్పులు చేర్పులు చేసి ఆ కేబినెట్తోనే ఎన్నికలకు వెళ్లేందుకు డిసైడ్ అయినట్టే కనపడుతోంది.
వచ్చే సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా ఏపీ కేబినెట్లో మార్పులు - చేర్పులు ఉండే ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థికమంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖాయమైంది. రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగాలని డిసైడ్ అయిన యనమల బీసీ కోటాలో రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమైపోయారు. యనమల ప్లేస్ను మరొకరితో భర్తీ చేయాలి. యనమల తప్పుకుంటే ఆర్థికమంత్రి రేసులో సీనియర్లు కళా వెంకట్రావు, దేవినేని ఉమాతో పాటు మాజీ ఆర్థికమంత్రి, ఇటీవలే టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.
ఇక తాజ మార్పులు, చేర్పుల్లో చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికే చెందిన ఓ సీనియర్ను తప్పించి, ఆ ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందిన మరో యంగ్ ఎమ్మెల్యేకు చోటు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రత్తిపాటి గతంలో వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆయన శాఖలో భార్యతో పాటు కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువ కావడంతో బాబు ఆయన శాఖ మార్చి పౌరసరపరాల శాఖ ఇచ్చారు.
ఇప్పుడు ఈ శాఖలో కూడా ఆయనపై ఆరోపణలు ఆగడం లేదు.
దీంతో ప్రత్తిపాటిని మార్చి ఆయనకు బదులుగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ను మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గొట్టిపాటి లోకేష్ కోటరీలో కీలకంగా మారారు. ఇటు కమ్మ వర్గానికి చెందిన ప్రత్తిపాటిని తప్పిస్తే అటు గొట్టిపాటితో ఆ ప్లేస్ భర్తీ చేస్తే సామాజికవర్గ పరంగా సమతుల్యత దెబ్బతినదు. ఇక గొట్టిపాటికి పదవి ఇస్తే ఫ్యూచర్లో అటు పార్టీకి, ఇటు లోకేష్కు, ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి కీలకం అవుతాడన్నదే బాబు ప్లాన్. ఏదేమైనా పుల్లారావుపై మెడపై వేటు కత్తి వేలాడుతోంది.