తెలుగు మీడియా పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయం పవన్ చేపట్టిన తాజా పర్యటనలో స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ పర్యటనలో చేపడుతున్న కార్యక్రమాల ను గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు, పత్రికల నిండా వార్తలు కనీసం ఇందులో సగ భాగమయిన జగన్ పాదయాత్ర మీడియా కవరింగ్ కు నోచుకోదా?
ఈ విషయంలో తెలుగు దేశం ఎల్లో మీడియాకు సంబంధించిన ఒక్క పత్రిక ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఏ ఘటనకు ఇవ్వని ప్రాధాన్యత నిచ్చి ప్రచురించింది..ఉహీంచినట్టే దీనికి బదులుగా సాక్షి మీడియా తరుపున కొమ్మినేనిశ్రీనివాసరావు జగన్ను సుదీర్ఘ ఇంటర్వ్యూ చేసి ప్రచురించారు. అందుకోసం సాక్షిలో ఎడిట్పేజి ఎత్తివేయడం మరో దుస్సాంప్రదాయం.
ఇంతచేసినా ఇది సాక్షికే పరిమితం.పైగా జగన్ ఇంటర్వ్యూ అంత చప్పగా సాగింది పవన్ ఇంటర్వ్యూ ల కాక, విమర్శలు, అరుపులు, ఆవేశపూరిత వ్యాఖ్యలు లేకుండా ముగిసింది. ఏమైనా నెల రోజుల జగన్ యాత్రకు రాని ఫోకస్ మూడు రోజుల పవన్ పర్యటనకు రావడం మన మీడియా ప్రస్తుత దశకు దర్పణం. ఎవరి ఎంత కరెక్ట్ అనేది మరో ప్రశ్న.