ఈ మద్య గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి, కాంగ్రెస్ ల మద్య హోరా హోరీ గా మాటల యుద్దం జరిగింది. గుజరాత్ లో గెలుపు కోసం ఇరు పక్షాలు నువ్వా నేనా అన్న విధంగా ప్రచారం కొనసాగించారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మోదీ నీచమైన మనిషి అని అయ్యర్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించిన తీరు అందరి మనసులని దోచుకుంది.
అయ్యర్ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసి ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో నెటిజన్లు రాహుల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్నింట్లో ఓ ట్వీట్ తెగ హల్చల్ చేస్తోంది. అలహాబాద్కి చెందిన కాంగ్రెస్ నేత హసీబ్ అహ్మద్ డిజైన్ చేయించిన ఓ పోస్టర్.. ఇందులో కనపడుతోంది. క్రికెటర్ గా మైదానంలో బాల్ను కొడుతున్నట్లు రాహుల్ని అందులో చూపించారు.
ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ గా మైదానంలో బాల్ను కొడుతున్నట్లు రాహుల్ని అందులో చూపించారు. ఈ ఫొటోలో బాల్ రూపంలో అయ్యర్ ఉన్నారు. ఈ ఫొటోపై ‘వెల్ డన్ రాహుల్ భయ్యా’ అని క్యాప్షన్ రాసుంది.