తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ మధ్య కనబడడం చాలవరకు తగ్గింది. గతంలో ఆయన మీడియా ముందు కనిపించినంతగా ప్రస్తుతం కనిపించడం లేదు. తన శాఖకు సంబంధించిన పనులన్నింటినీ చకచక చక్కబెట్టేస్తున్నారు.

తాజాగా మంత్రి పర్యటించిన కాలేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షించడానికి కన్నె పల్లి పంప్ హౌస్ వద్ద జరిగిన ఘటనతో వార్తలోకి వచ్చారు .విషయానికి వస్తే పంప్ హౌస్ వద్ద పర్యటించిన హరీష్ రావు తన మొబైల్ ఫోను  పోగొట్టుకున్నారు.

తన మొబైల్ పోయినట్టు మంత్రిగారికి ఆ ప్రాంతం వదిలి వెళ్లకాకాని అర్థం కాలేదు. కొంత దూరం ప్రయాణించాక ఆయన మొబైల్ ఫోన్ చూసుకున్నారు. కనిపించకపోవడంతో కన్నేపల్లి పంప్ హౌస్ కు తిరిగివచ్చారు స్వయంగా మంత్రితో పాటు సిబ్బంది మొత్తం ఆ ప్రాంతాన్ని గాలించారు కానీ ఫోన్ దొరకలేదు. హరీష్ రావు ఏమి చెయ్యలేక నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: