తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోతుంది... ఈ క్రమంలో చంద్రబాబుకు  తెలంగాణ విద్యార్ధులు పాలాభిషేకం  చేశారు... పాల అభిషేకం చేసే అంతగా తెలుగుదేశం పార్టీ ఏం ఘనకార్యం చేసిందనే సందేహం రావచ్చు.

అసలు విషయానికొస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన  నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి కి కారణం డిఎస్సి నోటిఫికేషన్. ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులు చాలా నిరాశలో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినా కానీ ఏపీలో చంద్రబాబు రెండవసారి డీఎస్సీ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

కానీ తెలంగాణా రాష్ట్రంలో పరిస్థితి దీనికి బిన్నంగా ఉంది. ఎప్పటి నుంచో మాట ఇస్తున్నారు కానీ నోటిఫికేషన్ విడుదల మాత్రం చెయ్యలేదు. దీంతో అక్కడ విద్యార్దులు, నిరుద్యోగులు  తీవ్ర అసహనానికి నిరాశకు గురి అయ్యారు. ఈ క్రమంలో కేసీఆర్ వైఖరిని నిరసించిన తెలంగాణ విద్యార్థులు మహబూబ్ నగర్ లో చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి విన్నూత్నంగా నిరసన తెలియజేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: